logo

విజయానికి ఎంత దూరంలో ఉన్నాం..

లోక్‌సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరంలో ఉన్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎమ్మెల్యేలతో సమీక్షించారు.

Published : 09 May 2024 02:35 IST

ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ మంతనాలు

 సైనిక్‌ఫురిలోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమైన కేటీఆర్‌

కాప్రా, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరంలో ఉన్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎమ్మెల్యేలతో సమీక్షించారు. బుధవారం. మధ్యాహ్నం సైనిక్‌పురిలోని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిరిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, ఉప్పల్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి జహంగీర్‌ పాషా, కార్పొరేటర్లు, తెరాస నాయకులతో సమావేశం అయ్యారు. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఎన్నికల ప్రచార సరళిపై సమీక్ష చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు