logo

వంకలోపడి మహిళ మృతి

స్థానిక రామారాజు వంకలో ప్రమాదవశాత్తు పడి మహిళ సాకె దివ్య(26) మృతి చెందినట్లు ఎస్సై జయరాములు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు నల్లగుట్టపల్లె పంచాయతీ రామాపురానికి చెందిన సాకె దివ్య

Published : 17 Jan 2022 04:30 IST

రామాపురం, న్యూస్‌టుడే: స్థానిక రామారాజు వంకలో ప్రమాదవశాత్తు పడి మహిళ సాకె దివ్య(26) మృతి చెందినట్లు ఎస్సై జయరాములు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు నల్లగుట్టపల్లె పంచాయతీ రామాపురానికి చెందిన సాకె దివ్య మతిస్థిమితం లేకుండా తిరుగుతూ ఉండేదని తెలిపారు. ఆదివారం నది వద్దకు వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందిందని పేర్కొన్నారు. నదిలో మృతదేహం తేలియాడుతుండటంతో గుర్తించామన్నారు. తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని