ఈసారి ఏకాంతమా.. వైభోగమా !
ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట రామయ్య క్షేత్రంలో ఈసారి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నవమి వేడుకల ప్రణాళిక అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలనకు తిరుమల తిరుపతి దేవస్థానం
ఖరారు కాని బ్రహ్మోత్సవాల ప్రణాళిక
నవమి వేడుకల ఏర్పాట్లపై కదలని తితిదే
కొవిడ్ వ్యాప్తితో అధికార యంత్రాంగం తర్జన భర్జన
ఒంటిమిట్ట కోదండరామాలయం
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకలను గత కొన్నేళ్లుగా అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2015లో తితిదేలోకి విలీనమైన అనంతరం 2016, 2017, 2018, 2019లో కనులపండువగా వేడుకలు జరిగాయి. ఏటా నిర్వహణకు రూ.3 కోట్లు నుంచి రూ.5 కోట్లు వెచ్చించేవారు. కరోనా మొదటి దశలో విజృంభణతో 2020లో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. గతేడాది రెండో దశలో కొవిడ్ పంజా విసరడంతో ప్రాచీన కట్టడాలను మూసివేయాలని కేంద్ర పురావస్తుశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో భక్తుల్లేకుండానే నిరాడంబరంగా నిర్వహించారు. ప్రస్తుతం కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ నుంచి శ్రీరామనవమి వేడుకలను ఎలా నిర్వహించాలన్నదానిపై తితిదే, జిల్లా ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. ఏకాంతంగా చేయాలా? వైభవంగా నిర్వహించాలా అనే అంశంపై స్పష్టత రాలేదు. ఏప్రిల్ 15న సీతారాముల కల్యాణం, 16న రథోత్సవం, 19న పుష్పయాగం నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం కొవిడ్ వ్యాపిస్తుండడంతో ఎలా నిర్వహిస్తే బాగుంటుందని ఉన్నతస్థాయిలో చర్చించడానికి గత రెండు వారాలుగా తితిదే ఉన్నతాధికారులు ఒంటిమిట్టకు వస్తారని సిబ్బంది చెబుతూ వస్తున్నారు. గతంలో ఉత్సవాలపై ముందస్తుగానే ఈవో, జేఈవో, సీవీఎస్వో, సీఈ స్థాయి అధికారుల బృందం డిసెంబరు, జనవరి తొలి, రెండో వారంలో వచ్చేవారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సన్నద్ధతపై ఒంటిమిట్టలో అటు తితిదే, ఇటు జిల్లా యంత్రాంగం గానీ సమీక్ష నిర్వహించలేదు. పైగా ఇంతవరకు ఉత్సవాల ముహూర్తం పత్రికను ఖరారు చేస్తూ అర్చకులు, ఆగమ సలహాలదారుల నుంచి ధ్రువీకరించి ఇవ్వలేదని తెలిసింది. వరుసగా 2020, 2021లలో రెండేళ్లపాటు ఏకాంతంగా నిర్వహించారు. ఈసారైనా కొవిడ్ నిబంధనలను అనుసరించి భక్తుల సమక్షంలో నిర్వహిస్తే బాగుటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం
ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈసారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నిర్వహణపై దృష్టి సారించాం. త్వరలో ఉన్నతాధికారులతో చర్చించి ఎలా చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం. గతంలో కంటే ఈసారి మరింత వైభవంగా వేడుకలను నిర్వహించాలని భావిస్తున్నాం. కాకపోతే కరోనా మూడో దశ శరవేగంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుటుందని ఉన్నత స్థాయిలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి నిర్వహిస్తాం. - ఆర్.రమణప్రసాద్, డిప్యూటీ ఈవో, తితిదే
సీతారామలక్ష్మణ మూర్తులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి
[ 26-04-2024]
మండల కేంద్రంలో శుక్రవారం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్యవిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
ఊరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది
[ 26-04-2024]
మీ ఊరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఎస్ఐ నాగమురళి తెలిపారు. శుక్రవారం మండలంలోని చెన్నారెడ్డిపల్లె ఆర్సీఎం చర్చి వద్ద గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. -
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా