నేటి నుంచి రిలేనిరాహార దీక్షలు
పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లావ్యాప్తంగా బుధవారం ఉద్యోగులు ఆందోళన, మానవహార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. జిల్లా సచివాలయం ఎదుట గురువారం
కొనసాగుతున్న ఉద్యోగుల ఉద్యమం
జిల్లావ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు
అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తున్న పీఆర్సీ సాధన సమితి నాయకులు
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, కడప గ్రామీణ: పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లావ్యాప్తంగా బుధవారం ఉద్యోగులు ఆందోళన, మానవహార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. జిల్లా సచివాలయం ఎదుట గురువారం నుంచి 30వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలకు సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులు, సచివాలయ, పొరుగుసేవలు, ఒప్పంద, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని పీఆర్సీ సాధన సమితి నేతలు పిలుపునిచ్చారు. ఆందోళనలో భాగంగా కడప ఆర్టీసీ బస్టాండు కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన కార్యక్రమంలో పాల్గొన్న పీఆర్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నేతలు వెంకటజనార్దనరెడ్డి, జలీల్, ఖజానశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగమేనన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలని, తమపై దుష్ప్రచారం చేయడం సరి కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేసి పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలు జరిపి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఎన్జీవో సంఘ కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి
[ 26-04-2024]
మండల కేంద్రంలో శుక్రవారం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్యవిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
ఊరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది
[ 26-04-2024]
మీ ఊరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఎస్ఐ నాగమురళి తెలిపారు. శుక్రవారం మండలంలోని చెన్నారెడ్డిపల్లె ఆర్సీఎం చర్చి వద్ద గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. -
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!