ఎత్తిపోతున్నాయ్!
ఉమ్మడి కడప జిల్లాలో ఎత్తిపోతల పథకాలు మరుగున పడుతున్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యం, నిధుల లేమి, అన్నదాతల్లో కొరవడిన ఐక్యత, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అధికార యంత్రాంగం వెరసి పథకాలు కనుమరుగవుతున్నాయి. జిల్లాలో రూ.వందల కోట్లు
ఉమ్మడి కడప జిల్లాలో సగానికి పైగా మూలకు
23,800 ఎకరాల ఆయకట్టుకు అందని సాగునీరు
పిచ్చి మొక్కల మధ్య చెన్నమరాజుపల్లె ఎత్తిపోతల పథకం
ఉమ్మడి కడప జిల్లాలో ఎత్తిపోతల పథకాలు మరుగున పడుతున్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యం, నిధుల లేమి, అన్నదాతల్లో కొరవడిన ఐక్యత, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అధికార యంత్రాంగం వెరసి పథకాలు కనుమరుగవుతున్నాయి. జిల్లాలో రూ.వందల కోట్లు పెట్టి నిర్మించి ఇప్పటికి నీరివ్వని వెలిగల్లు ప్రాజెక్టుకు మించిన ఆయకట్టు వీటి కింద ఉండడం గమనార్హం. పథకాలు, వాటి కింద ఆయకట్టు, పాడైన పథకాలు, వాటికింద ఉన్న ఆయకట్టు, కారణాలు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. మొత్తం ఆయకట్టులో రెండొంతులకు నీరందడంలేదంటే ఎత్తిపోతల పథకాల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
- న్యూస్టుడే, కడప గ్రామీణ
ఉమ్మడి కడప జిల్లాలో ప్రభుత్వ నిధులతో నిర్మించి రైతులకు అప్పగించినవి 35 ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటి కింద అధికారిక లెక్కల ప్రకారం 23,800 ఎకరాల ఆయకట్టుంది. ఉన్నవాటిల్లో తాజాగా 28 పథకాలు పనిచేయడంలేదు. వీటిల్లో కొన్ని నీరు లేక మరుగున పడగా, మరికొన్ని 2020, 2021ల్లో వచ్చిన తుపాన్లకు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి కింద ఉన్న ఆయకట్టు సుమారు 13,710 ఎకరాలు. నీరులేక, రైతుల మధ్య వివాదాల కారణంగా ఆగిన ఆరు పథకాల కింద మరో 2,825 ఎకరాల ఆయకట్టుంది. పథకాలు పనిచేయకపోవడంతో నీరందని ఆయకట్టు పోనూ మిగిలింది కేవలం 7,265 ఎకరాలు మాత్రమే. ఇందులోనూ కొన్ని పథకాలు చురుగ్గా పనిచేస్తుంటే, మరిన్ని అరకొరగా పనిచేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
నిర్వహణపై అలక్ష్యం...
రూ.176 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై ఇటు ప్రభుత్వం, అటు రైతులు అలక్ష్యం వహిస్తున్నారు. పొరుగు జిల్లాల్లో పథకాల కింద మూడు కార్లు పంటలు తీస్తున్నారు. అదే ఉమ్మడి కడప జిల్లాలో పథకాలు ఆ పరిస్థితి కనిపించడంలేదు. జిల్లాలో చాపాడు మండలం నక్కలదిన్నె ఎత్తిపోతల పథకం ఒక్కటే ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ రైతులందరూ ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వ నిధులతో చక్కగా నిర్వహించుకుంటున్నారు. రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించడం ఎంత అవసరమో నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యత ఉన్న చోట ఎత్తిపోతల పథకాలు నిర్మించడం అంతే అవసరం. ప్రభుత్వం చొరవ చూపి సరిపడా నిధులు సమకూర్చి పథకాలు బాగు చేయించాల్సిన అవసరముందని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
పథకాలు దెబ్బతినడం వాస్తవమే...
ఉమ్మడి కడప జిల్లాలో ఎత్తిపోతల పథకాలు దెబ్బతినడం వాస్తవమే. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మరమ్మతులు చేపడతాం. పథకాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందుకు ఆయకట్టు రైతుల సహకారం కూడా చాలా అవసరం. - సుధీర్కుమార్, ఈఈ, ఏపీఎస్ఐడీసీ, కడప
వృథాగా చెన్నమరాజుపల్లె ఎత్తిపోతల పథకం పరికరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?