logo

ఘనంగా గోదా రంగనాయకుల కల్యాణం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయాలైన శ్రీవేణుగోపాలస్వామి, నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీగోదా రంగనాయకుల కల్యాణ వేడుకలను

Published : 15 Jan 2022 04:07 IST

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయాలైన శ్రీవేణుగోపాలస్వామి, నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీగోదా రంగనాయకుల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై గోదా రంగనాయకుల విగ్రహాలను అందంగా అలంకరించి ఆలయ స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు కల్యాణ తంతును జరిపారు. కన్యదాతలుగా మరంగంటి గిరిధరచార్యుల దంపతులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఏఈవో ప్రతాప నవీన్‌, అర్చకులు రాచకొండ భాను, గోపన్నగారి గణేష్‌, నమిలికొండ రాజేశ్వరశర్మ, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని