ఆహ్లాద వేదిక... విజ్ఞాన వీచిక
జిల్లా సిగలో మరో మణిహారం చేరనుంది. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్ వద్ద చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తవగా అన్ని రకాల
అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణం వేగవంతం
న్యూస్టుడే, ఎల్లారెడ్డిపేట
ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన ప్రవేశద్వారం
జిల్లా సిగలో మరో మణిహారం చేరనుంది. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్ వద్ద చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తవగా అన్ని రకాల హంగులతో ముస్తాబవుతోంది. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే వేదికే కాకుండా దట్టమైన అడవులపై సంపూర్ణ అవగాహన పెంపొందించే విజ్ఞాన వీచికగా ఇది రూపుదిద్దుకుంటోంది. పట్టణాల్లోని పార్కులకు దీటుగా మౌలిక సదుపాయాలతో త్వరలోనే జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. తొమ్మిదెకరాల విస్తీర్ణంలో మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకొని అందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. వివిధ రకాల మొక్కల పెంపకం కోసం పార్కులో గుంతలు తీసే ప్రక్రియను ప్రారంభించారు.
గజీబో
50 హెక్టార్లు... రూ. 6 కోట్లు
జిల్లాలోని పోతురెడ్డిపల్లి రిజర్వు ఫారెస్ట్ బ్లాకులో 415 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండగా, అందులోని 50 హెక్టార్లను అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణానికి కేటాయించారు. హైదరాబాద్ వంటి పట్టణాలకు తీసిపోని విధంగా రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో పూర్తిస్థాయి సౌకర్యాలతో పార్కును తీర్చిదిద్దాలని నిర్ణయించి 2020 జూన్ 26న పార్కు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గడిచిన రెండేళ్లలో వివిధ నిర్మాణాలకు రూ. 2.42 కోట్లను ఖర్చు చేశారు. చెయిన్లింక్ (దారి), ఫెన్సింగ్ పనులు కొనసాగుతుండగా వాచ్మెన్ క్యాబిన్ గదితోపాటు వ్యూ టవర్, సోలార్ పంపుసెట్ను ఏర్పాటు చేశారు. రెండు టికెట్ కౌంటర్లతో కూడిన ప్రవేశద్వారం, లోటస్పాండ్, యోగా షెడ్డు, గజీబో (సందర్శకులు కూర్చోవడానికి షెడ్డు)లను ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే అర్బన్ ఫారెస్ట్ పార్కు అందుబాటులోకి రానుంది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితోపాటు ఇతర జిల్లా స్థాయి అధికారులు పార్కు నిర్మాణ పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
మొక్కల పెంపకానికి ప్రాధాన్యం
అర్బన్ ఫారెస్ట్ పార్కులో దట్టమైన అడవిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో అటవీజాతి మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. నల్లమద్ది, తెల్లమద్ది, విప్ప, ఠాని, బుడ్డ ధరణి, బట్టగుణం, రావి, మర్రి, వెదురు, జిట్రేగి వంటి అటవీజాతి మొక్కలకు ప్రాధాన్యతనివ్వనున్నారు. పార్కులోని 9 ఎకరాల్లో 36 వేల మొక్కలు నాటనుండగా ఇప్పటికే గుంతలు తీసే పనులు ఊపందుకున్నాయి. లక్ష మొక్కల సామర్థ్యంతో నర్సరీని ఏర్పాటు చేయనున్నారు. ధూలపల్లిలోని అటవీ పరిశోధన సంస్థ నుంచి అడవి ఆముదం, తిప్పతీగ, నేలవాము తదితర 25 నుంచి 30 రకాల ఔషధ మొక్కలను తీసుకొచ్చి, మరో ఎకరం విస్తీర్ణంలో నాటనున్నారు. దీంతోపాటు నక్షత్రవనం, రాశివనం, నవగ్రహ వనాలను ఏర్పాటు చేయనున్నారు. మూత్రశాలలు నిర్మించి, తాగునీరు, క్యాంటీన్ వసతులు కల్పించనున్నారు. సందర్శకులు కూర్చోవడానికి ప్రత్యేకమైన బల్లలను సమకూర్చనున్నారు.
పార్కులో అబ్బురపరుస్తున్న లోటస్పాండ్
త్వరలోనే పూర్తి చేస్తాం
- శ్రీనివాసరావు, అటవీక్షేత్రాధికారి, సిరిసిల్ల
అర్బన్ ఫారెస్ట్ పార్కును అన్ని హంగులతో నిర్మించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ సంవత్సరం పార్కులో మొక్కలు పెంచే పనులు నిర్వహించనున్నాం. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మానసిక ఆహ్లాదం కలగడమే కాకుండా అడవి ఎలా ఉంటుంది? అనే అంశంపై ప్రజలకు అవగాహన కలుగుతుంది. అడవుల ప్రాముఖ్యత, ఉపయోగాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ పార్కు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే బడ్జెట్కు అనుగుణంగా పార్కులో మరిన్ని నిర్మాణాలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం