మూఢ నమ్మకాలు.. మృత్యుశాసనాలు
మూఢ నమ్మకాలపు విషపు జాడ్యానికి ముగ్గురు బలయ్యారు. ఎప్పటిలాగే అందరితో ఉన్న వారు ఊహించని దాడిలో విగతులయ్యారు. వాడలో ఎవరికి ఏ జబ్బు చేసినా.. ఎవరు అస్వస్థతకు గురైనా వారే కారణమనేలా
ముగ్గురి హత్యతో ఉలిక్కిపడిన ఉమ్మడి జిల్లా
ఈనాడు డిజిటల్, కరీంనగర్ న్యూస్టుడే- జగిత్యాల గ్రామీణం
రోదిస్తున్న మృతుల బంధువులు
మూఢ నమ్మకాలపు విషపు జాడ్యానికి ముగ్గురు బలయ్యారు. ఎప్పటిలాగే అందరితో ఉన్న వారు ఊహించని దాడిలో విగతులయ్యారు. వాడలో ఎవరికి ఏ జబ్బు చేసినా.. ఎవరు అస్వస్థతకు గురైనా వారే కారణమనేలా కక్షను పెంచుకున్న కిరాతకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పదుల సంఖ్యలో జనాలు గుమిగూడి ఉన్నచోట మంత్రాల నెపంతో అతికిరాతకంగా అంతమొందించారు. జగిత్యాలలో జరిగిన ఈ మృత్యుశాసనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనాన్ని సృష్టించింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఇప్పటికీ నేలపై రాజ్యమేలుతున్నా మూఢ విశ్వాసాన్ని ఈ సంఘటన ఎత్తిచూపుతోంది.
వారానికి రెండు కేసులు
జగిత్యాల పట్టణంలోని టీఆర్నగర్లో దాదాపు 10 వేల మంది ఉండగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఇక్కడ ఉండి కూలీ పని చేయటం, ట్రాక్టర్ల డ్రైవర్లు, గుమాస్తాలుగా పనిచేసే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి వారం ఒకటి రెండు కేసులు జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్కు రావటం పరిపాటిగా మారింది. మద్యం తాగి ఘర్షణకు దిగటం, భూ వివాదాలు, కుటుంబ గొడవలు నిత్యం ఏదో వాడకు జరుగుతూనే ఉంటాయి. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటం, అంతా కూలీ పనులు చేసే వారు మద్యం తాగిన సందర్భాల్లో ఘర్షణలు, గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన జగన్నాథం నాగేశ్వర్రావు, అతని కుమారులు రాంబాబు, రమేశ్ను గురువారం ప్రత్యర్థులు హత్య చేయగా మంత్రాల అనుమానంతో హత్యకు పాల్పడ్డట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఇదే గ్రామంలో గత 6 నెలల కిందట ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా చెతబడితోనే మృతి చెందాడని గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అతను బతికిస్తానని క్షుద్రపూజలు చేయటంతో రెండు రోజుల పాటు మృతదేహాన్ని అలాగే ఉంచారు. ఈ ఘటన గ్రామంలో అప్పుడు సంచలనం కలిగించింది. పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి మృతదేహాన్ని ఖననం చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ 6 నెలల తర్వాత అలాంటి ఘటన వెలుగు చూడగా మూడు ప్రాణాలను మంత్రాల అనుమానంతోనే బలి తీసుకున్నారు.
50 మంది వడ్డీ వ్యాపారులు
గ్రామంలో దాదాపు 50 కుటుంబాల వరకు వడ్డీ వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. ఇది కూడా 10 నుంచి 20 శాతానికి వడ్డీ వ్యాపారం సాగుతుందని గ్రామంలో ప్రచారం సాగుతోంది. పోలీసులు వడ్డీ వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో గ్రామంలో జరిగే వడ్డీ వ్యాపారంతోపాటు, మద్యం అమ్మకాల నియంత్రణకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 10 నుంచి 12 రాష్ట్రాలకు చెందిన వారు వివిధ పనుల కోసం వచ్చి దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఆధార్ కార్డు పొంది ఇళ్లు నిర్మించుకోగా, కొందరు అద్దెకు ఉంటున్నారు. చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి బంధువుల ఇంటికి వచ్చి ఇక్కడే తల దాచుకుంటున్నారు. ఈ హత్యకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సంఘటన స్థలం వద్ద ఎస్పీ సింధుశర్మ, అదనపు ఎస్పీ రూపేష్, డీఎస్పీ ప్రకాష్
గతంలోనూ ఘటనలు..
* 2017 జులై 10న హుజూరాబాద్ మండలం కందుగులలో మంత్రాల నిందారోపణలతో ఓ కుటుంబం బలి అయింది. ఎవరికి అనారోగ్య సమస్య తలెత్తినా.. వీరి వైపే వేలెత్తి చూపించే తీరుని తట్టుకోలేక ఇంటి యజమాని కొమురయ్యతోపాటు అతని భార్య ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.
* జగిత్యాల జిల్లా మేడిపల్లిలో నాలుగేళ్ల కిందట మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఇదే తరహాలో పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలోనూ మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో కొందరిపై దాడి చేసిన సంఘటనలున్నాయి. ఈ తరహా ఘటనల్లో పలువురిపై కేసులు నమోదయ్యాయి.
* క్షుద్రపూజలు చేస్తున్నారనే విషయంలోనూ ఇంకా పలు గ్రామీణ ప్రాంతాల్లో అడపాదడపా అలజడులు రేగుతున్నాయి. ఈ విషయమై తరచూ గొడవలు జరుగుతున్న సందర్భాలు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. వీటిపై అవగాహన కల్పించే చర్యలు ఇటీవల కనిపించకపోవడంతో ఈ జాడ్యపు మూలాలు వీడటంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం