ఆయకట్టు రైతులకు మళ్లీ నిరాశే
రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టు రైతులకు నీరందడం ప్రశ్నార్థకంగా మారింది. బీర్పూర్, ధర్మపురి మండలాల రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలన్న ఉద్దేశంతో రోళ్లవాగు
నిలిచిన రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు
సారంగాపూర్, న్యూస్టుడే
బుగ్గప్రాంతంలో నిలిచిన నీరు
రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టు రైతులకు నీరందడం ప్రశ్నార్థకంగా మారింది. బీర్పూర్, ధర్మపురి మండలాల రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలన్న ఉద్దేశంతో రోళ్లవాగు ప్రాజెక్టు అధునికీకరణ పనులు ఆరేళ్ల క్రితం ప్రారంభించారు. ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో మళ్లీ పాత పద్ధతిన నీరందించే పరిస్థితి ఏర్పడింది. 2016లో రూ.60కోట్లతో టెండర్ ప్రక్రియ ప్రారంభమవ్వగా, 2017లో ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ వరకు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నీరందిస్తామని, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించి పనులు వేగవంతం చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ అంచనా విలువ పెరగడం.. మట్టి సేకరణ పూర్తి కాకపోవడంతో పనుల్లో మరింత జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పనులు నిలిచిపోయి.. ఆక్టోబరు వరకు పనులు ప్రారంభించే పరిస్థితి లేకుండా పోయింది.
పెరిగిన అంచనా విలువ
ప్రాజెక్టు ఆధునికీకరణ చేపట్టే సమయంలో 0.25 టీఎంసీ సామర్థ్యం నుంచి టీఎంసీ నిలువ చేసేందుకు రూ.60 కోట్లు మాత్రమే అంచనా ఉండగా, పనుల జాప్యం, పెరిగిన భూ నిర్వాసితుల విలువతో ప్రస్తుతం రూ.136 కోట్లకు చేరుకుంది. దీనివల్ల అదనపు నిధుల కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదించడంతో నిధుల మంజూరు జాప్యం కారణంగా గుత్తేదారు పనుల్లో వేగం తగ్గించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కట్ట నిర్మాణానికి అవసరమైన మట్టిని తరలించడం సమస్యగా మారింది. ప్రస్తుతం వర్షాలు కురవడంతో మట్టి సేకరణతోపాటు, కట్ట నిర్మాణం చేపట్టడం నిలిచిపోయింది.
పెండింగ్లో బిల్లులు
ప్రస్తుతం మొదటి కట్ట పొడవు 450 మీటర్ల పనులు పూర్తి కాగా రెండో కట్ట పొడవు 300 మీటర్లకు గానూ అటవీ ప్రాంతంలో ఉండడంతో అనుమతి రాకపోవడంతో ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. బుగ్గ నీటిని అరికట్టేందుకు నిర్మించే కట్ట ప్రాంతంలో దాదాపు 75 మీటర్ల పొడవు, 15 మీటర్ల ఎత్తుతో కట్టను నిర్మించాల్సి ఉంది. అంతే కాకుండా ప్రాజెక్టు ఉన్న మూడు తూములకు షట్టర్లు బిగించాల్సి ఉంది. ప్రస్తుతం వర్షాలు కురవడం.. నిధులు మంజూరు లేకపోవడంతోపాటు గతంలో చేసిన పనులకు కూడా బిల్లులు రాక పనులు నిలిచిపోయాయి.
పాతపద్ధతిలోనే..
- చక్రునాయక్, డీఈఈ, రోళ్లవాగు ప్రాజెక్టు
జూన్ మొదటి వారం నుంచే వర్షాలు కురవడంతో పనులు నిలిచిపోయాయి. వర్షాలు పూర్తి కాగానే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతాం. రైతులకు ఇబ్బంది లేకుండా పాత పద్ధతిలో ఆయకట్టు రైతులకు నీరందించేలా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం