విస్తరిస్తేనే శాశ్వత పరిష్కారం
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లే ఘాట్రోడ్డును రూ.62 కోట్లతో విస్తరించడానికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2018 సెప్టెంబరు 11న ఘాట్రోడ్డుపై నుంచి ఆర్టీసీ బస్సు దిగుతుండగా
కొండగట్టు ఘాట్రోడ్డు
న్యూస్టుడే, మల్యాల
ప్రమాదకరమైన
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లే ఘాట్రోడ్డును రూ.62 కోట్లతో విస్తరించడానికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2018 సెప్టెంబరు 11న ఘాట్రోడ్డుపై నుంచి ఆర్టీసీ బస్సు దిగుతుండగా చివరి మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 65 మంది దుర్మరణం చెందిన సంఘటన తర్వాత ప్రభుత్వం ఘాట్రోడ్డుపై నుంచి వాహనాల ప్రయాణాన్ని నిషేధించారు. మూడు సంవత్సరాల తొమ్మిది నెలలపాటు ఘాట్రోడ్డుపై నుంచి వాహనాలు దిగకుండా ఆంక్షలు విధించడంతో దిగువ కొండగట్టు ప్రాంతంలోని వ్యాపారులు ఘాట్రోడ్డును పునఃప్రారంభించాలని ఆందోళనలు చేపట్టారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు ఎమ్మెల్యే రవిశంకర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించి చివరికి గత నెల 30న ఘాట్రోడ్డును పునఃప్రారంభించారు. దీంతో స్థానిక వ్యాపారులు, భక్తులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ దాదాపు 1.5 కి.మీ పొడవుగల ఘాట్రోడ్డును విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
మలుపు ఘాట్రోడ్డుపై 2018లో ప్రమాదం జరిగిన ప్రదేశం ఇదే
రక్షణ చర్యలు అవసరం
ఘాట్రోడ్డును పునఃప్రారంభించిన తర్వాత వాహనాల వేగాన్ని నియంత్రించడానికి మూడు చోట్ల స్పీడ్బ్రేకర్ల వద్ద డ్రమ్ములు ఏర్పాటు చేసిన అధికారులు రాత్రి వేళల్లో అవి వాహనచోదకులకు కనిపించడానికి రేడియం స్టిక్కర్లు వేయాలని సూచిస్తున్నారు. ఘాట్రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఆర్అండ్బీ అధికారులు దాదాపు రూ.1.40 కోట్లు వెచ్చించి పలు చోట్ల రక్షణ గోడలు, వేగనియంత్రికలు నిర్మించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ప్రమాదాల నివారణకు ఘాట్రోడ్డును వెడల్పు చేసి మధ్యలో డివైడర్లు నిర్మించి ప్రమాదకరమైన మలుపులను సరిచేయాలని, అవసరమైతే రెండో ఘాట్రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. అంజన్న దర్శనం కోసం ప్రతి శని, మంగళవారాలు అధిక సంఖ్యలో భక్తులు కొండగట్టుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కొండపైన ‘వై’ జంక్షను వద్ద వాహనాలను నియంత్రించడానికి, అధికలోడుతో ఘాట్రోడ్డుపై నుంచి వాహనాలు దిగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మైకులో భక్తులకు సూచనలు చేయడానికి ఆలయ అధికారులు కూడా ఏర్పాటు చేయాలి. రవాణాశాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం