సరఫరా కావట్లేదు.. బియ్యం ఇయ్యట్లేదు..!
రేషన్ పంపిణీ ప్రక్రియలో జిల్లాలో ఆలస్యమనే తంతు కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 487 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 2,79,918 మంది కార్డుదారులున్నారు. ప్రతి ఒక్కరికి పది కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని అందిస్తున్నారు.
ఈనాడు, కరీంనగర్
* కరీంనగర్ పట్టణంలో మొత్తం 58 దుకాణాలు ఉండగా.. మంగళవారం కేవలం 31 దుకాణాల ద్వారానే రేషన్ బియ్యం పంపిణీ జరిగింది. ఈ ఒక్క రోజు కేవలం 1956 మందికి మాత్రమే డీలర్లు సరకును అందించగలిగారు. చాలా దుకాణాల్లో గత నెలకు సంబంధించిన స్టాక్ను తమ వద్దకు వచ్చిన కార్డుదారులకు అందించే ప్రయత్నాల్ని చేస్తున్నారు. అరకొరగా ఉన్న సరకును కొందరికే అందిస్తే కష్టమనే భావనతో.. పూర్తిస్థాయిలో కోటా వచ్చాకే ప్రక్రియను ప్రారంభించాలనే ఆలోచనలో పలువురున్నారు.
* గడిచిన కొన్ని నెలలుగా బియ్యం సరఫరా విషయంలో జిల్లాలో గందరగోళమనే పరిస్థితి నెలకొంటోంది. దీంతో డీలర్లు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కార్డుదారులకు సమాధానం చెప్పుకోలేక.. ఉన్న కాసిన్ని బియ్యాన్ని పక్కాగా ఇవ్వలేక సతమతమవుతున్నారు. రోజువారీగా తమకు ఎదురవుతున్న సమస్యను సంబంధిత పర్యవేక్షణ అధికారులకు విన్నవించినప్పటికీ ఇబ్బంది తీరేలా పరిష్కారం దొరకడంలేదనే భావన కొందరు డీలర్ల నుంచి వ్యక్తమవుతోంది.
* గత నెలలోనూ ఆలస్యంగానే దుకాణాలు తెరచుకున్నాయి. వరసగా వర్షాలు కురియడంతోపాటు లారీల ద్వారా సరఫరా అయ్యే విషయంలో చిక్కులు అధికారుల్ని ఇబ్బందులకు గురిచేశాయి. 5వ తేదీన ప్రారంభమైన ప్రక్రియను 25వ తేదీ వరకు కొనసాగించారు. అయినా పూర్తిస్థాయిలో కార్డుదారులు బియ్యాన్ని పొందలేకపోయారు.జూలై మాసంలో 2,48,535 మంది 78.70లక్షల కిలోల బియ్యాన్ని అందుకున్నారు.
బియ్యం పోస్తున్న దృశ్యం
రేషన్ పంపిణీ ప్రక్రియలో జిల్లాలో ఆలస్యమనే తంతు కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 487 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 2,79,918 మంది కార్డుదారులున్నారు. ప్రతి ఒక్కరికి పది కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని అందిస్తున్నారు. వాస్తవానికి ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఠంచనుగా లబ్ధిదారులకు దుకాణాలకు వచ్చిన సరకును అందించే ప్రక్రియను ప్రారంభించాలి. 20వ తేదీ చివరి గడవు తేదీ అవడంతో దాదాపుగా మొదటి పది రోజుల్లోనే చాలామంది డీలర్లు తమకు వచ్చిన కోటాను పూర్తిచేస్తారు. ఈ నెలలో ఇప్పటికే 9 రోజులు పూర్తయినా..అనుకున్న స్థాయిలో కార్డుదారులకు అవసరమై సరకు దరి చేరలేదు. దుకాణాలను 4వ తేదీ నుంచి తెరవడం గమనార్హం.!
పలురకాల సాకులతో..
లారీలు అందుబాటులో లేవనే సాకుతోపాటు వరసగా కురిసిన వర్షాల వల్ల ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద నుంచి బస్తాలను పంపించడం ఇబ్బందిగా మారుతుందనేది డీలర్లకు వినిపిస్తున్న మాట. పైగా గత కొన్నాళ్లుగా మాత్రం ఎప్పటికప్పుడు సరకును లోడ్ చేసి వాహనాల్లో పంపించే విషయంలో పర్యవేక్షణ లోపిస్తునట్లు స్పష్టంగా అర్థమవుతోంది. బియ్యం తడుస్తాయనే ఉద్దేశంతో లారీలు అనుకున్న విధంగా దుకాణాల చెంతకు చేరడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి రేషన్ చేరకపోవడంతో పాత స్టాక్ను ఉన్న వరకు పంచుతూ డీలర్లు నెట్టుకొస్తున్నారు. తమకు వచ్చే లోడ్ కోసం రోజులో ఐదారుసార్లు ఉన్నతాధికారులకు ఫోన్లు చేయాల్సి వస్తుందని డీలర్లు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.