logo

భక్తి శ్రద్ధలతో దుబ్బ మల్లన్న కల్యాణం

జమ్మికుంట పురపాలక పరిధి ధర్మారం దుబ్బమల్లన్న ఆలయ బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కల్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

Published : 06 Dec 2022 03:18 IST

స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

పట్నం వద్ద ఎమ్మెల్యే రాజేందర్‌

జమ్మికుంట, న్యూస్‌టుడే : జమ్మికుంట పురపాలక పరిధి ధర్మారం దుబ్బమల్లన్న ఆలయ బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కల్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మల్లికార్జునస్వామి, గొల్ల కేతమ్మ, మెడెలమ్మ ప్రతిమలకు అర్చక, ఒగ్గు పూజారులు కల్యాణాన్ని నిర్వహించారు. పెద్దపట్నం వేసి, నిర్వహించిన స్వామి వారి కల్యాణం భక్తులను తన్మయులను చేసింది. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, భాజపా నాయకులు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కె.విజయ, మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజేశ్వర్‌రావు, తెరాస నేతలు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. పెద్దపట్నం వద్ద స్వామివారికి మొక్కులు చెల్లించారు. మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ స్వప్న, కౌన్సిలర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ కె.సమ్మయ్య, దేవాలయ ఈవో సుధాకర్‌, నాయకులు పి.సత్యనారాయణరావు, పి.రామస్వామి, మల్లేశ్‌, రాజేందర్‌, శ్రీనివాస్‌, స్వామి, స్వరూప, నిరూపారాణి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని