ఆన్లైన్లో అనుమతి.. ఆమ్యామ్యాలతోనే పని
‘పట్టణంలోని ఆర్ఎన్టీనగర్కు చెందిన ప్రయివేటు ఉద్యోగి సుభాష్ గత నవంబరు 7న భవన నిర్మాణ అనుమతి రెన్యూవల్ కోసం టీఎస్బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు.
న్యూస్టుడే, జగిత్యాల పట్టణం
‘పట్టణంలోని ఆర్ఎన్టీనగర్కు చెందిన ప్రయివేటు ఉద్యోగి సుభాష్ గత నవంబరు 7న భవన నిర్మాణ అనుమతి రెన్యూవల్ కోసం టీఎస్బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ ఉద్యోగి నిర్మిత భవనాన్ని పరిశీలించి ధ్రువీకరించారు. బల్దియా ప్రణాళిక విభాగం ఉద్యోగి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా దరఖాస్తు తిరస్కరించడంతో అనుమతి నిలిపివేశారు. ఇదేంటని బల్దియా అధికారులను నిలదీస్తే మరోమారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండోసారి దరఖాస్తు చేస్తే రెవెన్యూ ఉద్యోగి తిరస్కరించారు. తాజాగా మూడోసారి దరఖాస్తు చేసినప్పటికీ అనుమతి కోసం నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడిందని దరఖాస్తుదారుడు వాపోయారు.’
స్పెషల్గ్రేడ్ పురపాలిక జగిత్యాలలో భవన నిర్మాణ అనుమతి దొరకాలంటే చేతినిండా డబ్బులన్నా ఉండాలి లేదా పలుకుబడి కలిగిన నేతల ప్రమేయమైనా ఉండి తీరాల్సిందే. పైన ఉదహరించినట్లు సుభాష్లాంటి సగటు దరఖాస్తుదారులు ఈ రెండూ లేనట్లయితే కాళ్లరిగేలా కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. అనుమతి రాకపోవడంతో నిర్మాణం ముందుకుసాగక.. బ్యాంకు రుణం అవసరమైనవారు ఆర్థిక అవసరాలు తీరక నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం అనుమతుల్ని పారదర్శకంగా అందించేందుకు టీఎస్బీపాస్ ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దరఖాస్తు చేసిన 21 రోజుల్లో నిబంధనల మేరకు అధికారులు అనుమతి జారీ చేయాల్సి ఉంటుంది. కానీ బల్దియా ప్రణాళిక విభాగం అంతులేని అక్రమాలకు పాల్పడుతోంది. ఏడాదిక్రితం ఏసీబీ దాడి చేసి ముగ్గుర్ని అరెస్టు చేసినా మార్పు కనిపించడంలేదు. పట్టణంలో గత జులై 1 నుంచి గత డిసెంబరు 31 వరకు మొత్తం 280 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 174 దరఖాస్తులకు అనుమతి లభించింది. మిగిలిన 126 దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిస్కరించారు. అనుమతుల విషయంలో బల్దియా, రెవెన్యూ ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ కారణంగా దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నిబంధనల బూచి.. నిలువెల్లా దోచి...
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన వారికి నిబంధనల సాకుతో అధికారులు ఇబ్బందులపాలు చేస్తున్నారు. పాత ఇల్లు, స్థలం ఉన్నవారు నూతన నిర్మాణాకి వెళ్తే.. 1983 నుంచి ఇంటి పన్ను చెల్లించినవారికి కొత్త పురపాలక చట్టం ప్రకారం ఎల్ఆర్ఎస్ వర్తించదు. ఈ పన్ను చెల్లించనివారికి మార్కెట్ విలువలో 14 శాతం ఎల్ఆఎర్ఎస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేకపోవడం, అసెస్మెంట్ కాపీలు దగ్గర లేకపోవడంతో అధికారులు వారికి ఎల్ఆర్ఎస్ తప్పనిసరని చెబుతూ అనుమతులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. చేసేదేంలేక అధికారులను ఆశ్రయించిన దరఖాస్తుదారులతో ఎల్ఆర్ఎస్ పేరిట కొంత, అనుమతి కోసం ఓ ధర నిర్ణయించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే అసెస్మెంట్ కాపీలను ప్రభుత్వం కొన్నాళ్లుగా జారీ చేయడంలేదు. కానీ అధికారులు రికార్డుల్లో పాత ఇంటికి సంబంధించిన పన్ను వసూళ్లు చూసి ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందా లేదా అనే విషయం తెలిపే అవకాశం ఉన్నప్పటికీ అవినీతే ప్రధానంగా ప్రణాళికా విభాగం వ్యవహరిస్తోంది. మరోవైపు దరఖాస్తుదారుడి ఇంటి నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బల్దియా ఉద్యోగులు దరఖాస్తును ఆన్లైన్లో తిరస్కరిస్తున్నారు. సదరు దరఖాస్తుదారుడు అనుమతి కోసం నిరీక్షించి కార్యాలయానికి వెళ్లి వాకబు చేస్తే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. అయితే డబ్బులిచ్చినవారికి మాత్రం సజావుగా అనుమతి చేతికందిస్తున్నారు. ఈ తరహా అక్రమ వ్యవహారాల కోసం అధికారులు కొందరు దళారులను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం
- నరేష్, ఇన్ఛార్జి కమిషనర్
దరఖాస్తుదారులు అనుమతిలో ఇబ్బందులుంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. ఇటీవల రెండు దరఖాస్తులకు అనుమతి జారీ చేశాం. ప్రజావాణిలోనూ రెండు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం ఉంది. నిబంధనల మేరకు ఉన్నవాటికి వెంటనే అనుమతి జారీ చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా నారసింహుడి చందనోత్సవం
[ 19-05-2024]
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాల్లో శనివారం స్వామి వారికి చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సన్నద్ధం
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. -
కోడ్ ముగిస్తేనే ప్రగతి వేగిరం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాల పరిధిలో కలెక్టర్ మొదలు కింది స్థాయి ఉద్యోగి వరకు లోక్సభ ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. -
ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
చిగురుమామిడి మండలం నవాబుపేట, సైదాపూర్ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఇతరులు నివసిస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ పాఠశాలల్లోని ఎస్జీటీలు ఎ.మంగ, బి.సునీతను సస్పెండ్ చేసినట్లు డీఈవో జనార్దన్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అర చేతిలోనే కథలు చదివేద్దాం!
[ 19-05-2024]
వేసవి సెలవులను పిల్లలు ఆనందంగా గడుపుతుంటారు. రోజులో కొంత సమయాన్ని నైపుణ్య పెంపు, లేదా వికాస వృద్ధికి కేటాయిస్తే వారి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇంటింటా కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ ఏదో ఒకటి ఉంటున్న నేపథ్యంలో పఠనా నైపుణ్యాలు పెంచే వెబ్సైట్లు రూపుదిద్దుకున్నాయి. -
జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 19-05-2024]
కొడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ నాచుపల్లి కళాశాల ఐఎస్వో గుర్తింపు పొందినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కామాక్షి ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు ఈనెల 15న జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలను సందర్శించి సర్టిఫికేషన్ కోసం అవసరమైన రికార్డులను పరిశీలించారు. -
ఎప్సెట్లో మెరిశారు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. ఉత్తమ ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, ఆ ప్రాంతానికి పేరు తీసుకొచ్చారు. -
ప్రేమ పేరుతో మోసం చేసిన యువతిపై కేసు
[ 19-05-2024]
ప్రేమ పేరుతో డబ్బులు దండుకుని మోసం చేసిందని ఓ యువతిపై ఎల్ఎండీ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడి తండ్రి వివరాల ప్రకారం.. -
పీహెచ్సీ వైద్య సేవలకు నిరీక్షణ
[ 19-05-2024]
చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. పేరుకు 24 గంటల ఆసుపత్రి అయినా.. కనీసం పగటిపూట కూడా ఎవరూ ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి
[ 19-05-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రానికి శనివారం భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. -
ఎల్లంపల్లిలో తగ్గిన నీటి మట్టం
[ 19-05-2024]
ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీటిమట్టం పడిపోయింది. డెడ్ స్టోరేజీకి చేరువైంది. రానున్న కాలంలో తాగునీటికి ముప్పు పొంచి ఉంది. ఇన్ఫ్లో పెద్దగా లేకపోగా ప్రతిరోజు తాగునీటితో పాటు ఎన్టీపీసీకి నీటిని సరఫరా చేయాల్సి ఉండటంతో ఉన్న నిల్వ కొద్ది రోజుల్లోనే ఆవిరయ్యే అవకాశం ఉంది. -
స్కాన్ చేయండి.. నమోదు చేసుకోండి
[ 19-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపడటం, వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రోజురోజుకు చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఓపీ నమోదు కోసమే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 19-05-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు. -
మధుర ఫలం.. సమస్యలతో సతమతం
[ 19-05-2024]
మధుర ఫలమైన మామిడిని పండిస్తున్న రైతులకు చేదుఫలితాలే మిగులుతున్నాయి. మన మామిడికాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండున్నా ఏటికేడు పెరుగుతున్న చీడపీడలకు తోడుగా కాయల విక్రయంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందున అసంపూర్తిగానే మామిడిసాగును కొనసాగిస్తున్నారు. -
హైరిస్క్లో 52 శాతం మంది
[ 19-05-2024]
జీవనశైలిలో మార్పులతో కుటుంబంలో ఎవరూ ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలియని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.