అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పాటు
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. మంగళవారం జమ్మికుంటలో నిర్వహించిన భారాస బహిరంగ సభ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపింది.
హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం!
జమ్మికుంట సభలో మంత్రి కేటీఆర్
ఈనాడు, కరీంనగర్, న్యూస్టుడే- జమ్మికుంట
జమ్మికుంట సభలో పాల్గొన్న జనం.. కేటీఆర్ అభివాదం
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. మంగళవారం జమ్మికుంటలో నిర్వహించిన భారాస బహిరంగ సభ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపింది. ఆకట్టుకునే జెండాలు, ఫ్లెక్సీలు తోరణాలు, కటౌట్లతో పట్టణం గులాబీమయమైంది. నియోజకవర్గ పరిధిలోని పురపాలికలు, ఆయా గ్రామాల నుంచి తరలి వచ్చిన జనాలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ కచ్చితంగా ఇక్కడి ప్రజల ఆశీర్వాదం భారాసకు ఉంటుందని అన్నారు. ఎన్నికలు వస్తే మళ్లీ భాజపా వారు హుజూరాబాద్లో చంపుకొంటారో.. సాదుకుంటారో అంటూ బీద ముఖం పెట్టుకుని వస్తారని.. పరోక్షంగా ఈటల రాజేందర్ను విమర్శించిన కేటీఆర్ వారి గులుగుడు, అలుగుడు చూసి ఆగం కావద్దని.. గందరగోళంలో పడొద్దని చెప్పారు. ఉప ఎన్నికలో జరిగిన పొరపాటు మళ్లీ జరగొద్దని.. హుజూరాబాద్ గడ్డ మీద రాబోయే ఏడెనిమిది నెలల్లో గులాబీ జెండా ఎగుర వేద్దామన్నారు. గుజరాతోళ్ల గులాంగిరీ చేసే షోకు, చెప్పులు మోయడం.. రేషం గల కరీంనగర్ బిడ్డలుగా మనకు అవసరం లేదని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి అవసరమైన నిధుల్ని అందిస్తూ అభివృద్ధికి తోడ్పాటునిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అడిగిన విధంగానే జమ్మికుంట, హుజూరాబాద్ మైదానాల ప్రగతికి రూ.కోట్ల నిధుల్ని అందిస్తామని.. ప్రజల మధ్యనే ఉంటూ వారి బాగోగుల్ని చూడాలని.. జనాల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని కౌశిక్రెడ్డికి సూచించారు.
* మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. సాగునీటికి పోరాటం చేసిన గడ్డకు కాళేశ్వరం జలాలను అందించిన ఘనత కేసీఆర్దన్నారు. భాజపా నాయకులు ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మహిళా సంఘాలకు అవసరమైన రుణం రూ.100 కోట్లను సీఎంతో మాట్లాడి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
* మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి పాటుపడే సర్కారు తమదన్నారు. కేంద్రానికి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే ఈ బడ్జెట్లో బీసీ మంత్రిని ప్రకటించాలని సవాలు విసిరారు. అప్పుడు తన చేతికి ఉన్న బంగారు తొడుగు ఈటల రాజేందర్, బండి సంజయ్కు తొడుగుతా అన్నారు. భవిష్యత్తులో కౌశిక్రెడ్డి శాసనసభ్యుడు అవుతారని అన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మాట్లాడుతూ.. మోదీ మేలు చేసింది అదానీ అంబానీలకు అని ఎద్దేవా చేశారు. సభలో జడ్పీ ఛైర్పర్సన్ విజయ, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ యాదవ్లు మాట్లాడారు. ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు రవిశంకర్, సతీశ్బాబు, రసమయి బాలకిషన్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, భారాస జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
వేదికపై ఎమ్మెల్యేలు రవిశంకర్, సతీశ్బాబు, రసమయి, ఎమ్మెల్సీలు రమణ, కౌశిక్రెడ్డి, మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, జడ్పీఛైర్పర్సన్ విజయ
ఆకట్టుకున్న ర్యాలీలు.. : సభాస్థలికి ఆటాపాటలతో ఉత్సాహభరిత వాతావరణంలో భారాస శ్రేణులు ర్యాలీగా తరలివచ్చాయి. డోలు వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ మైదానానికి చేరుకున్నారు. వేదికపైకి చేరుకున్న మంత్రి కేటీఆర్కు కౌశిక్రెడ్డి కూతురు త్రినిక పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికింది. పలువురు వినతి పత్రాలను అందించారు. సాయంత్రం 4.20 గంటలకు సభాస్థలికి వచ్చిన కేటీఆర్ సుమారు 20 నిమిషాల పాటు ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. సాయంత్రం 5.30 గంటలకు సభ ముగిసింది. హుజూరాబాద్ వరకు కాన్వాయ్లో వెళ్లిన మంత్రి అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. అంతకుముందు వేదికపై వేర్హౌస్ కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ బృందం పాటలతో ఆకట్టుకున్నారు. సభాస్థలి చుట్టూ ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్సీ కౌశిక్ పేరును పలికినప్పుడు ప్రజల నుంచి స్పందన వచ్చింది. కౌశిక్కు మంత్రి కేటీఆర్ కితాబునిచ్చిన తీరుతో పార్టీ శ్రేణుల్లో ఆయనకే టికెట్ వస్తుందేమో అన్న చర్చ చేశారు. ఇల్లందకుంట సమీపంలో మంత్రి కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం