నందిమేడారంలో కోర్టు ఏర్పాటు చరిత్రాత్మకం
నందిమేడారంలో కోర్టు ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్
వేదికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తులు జస్టిస్ నవీన్రావు, జస్టిస్ శ్రవణ్కుమార్, జిల్లా న్యాయమూర్తి నాగరాజు, కలెక్టర్ సంగీత, సీపీ రెమా రాజేశ్వరి తదితరులు
ధర్మారం, న్యూస్టుడే: నందిమేడారంలో కోర్టు ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. ఆదివారం ధర్మారం మండలం నందిమేడారంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన జిల్లా పెద్దపల్లి అన్నారు. ధూళికట్ట బౌద్ధ స్తూపాలు, ఓదెల మల్లికార్జునస్వామి, కమాన్పూర్లో ఆదివరాహస్వామి ఆలయాలు, రామగిరి ఖిల్లా తదితర ప్రాంతాలను ప్రస్తావించారు. జిల్లాలో 16,465 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా నెల రోజుల్లోనే భవన నిర్మాణం పూర్తి చేసిన యజమాని గట్టయ్యను సీజే అభినందించారు. గట్టయ్యను న్యాయమూర్తి జస్టిస్ పొనుగోటి నవీన్రావు సన్మానించారు.
కోర్టును ప్రారంభిస్తున్న సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ నవీన్రావు, జస్టిస్ శ్రవణ్కుమార్
ఘన స్వాగతం
నందిమేడారానికి చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం సీజే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సర్వ మత ప్రార్థనల అనంతరం కోర్టు హాలును ప్రారంభించారు. సభా వేదిక వద్ద ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు జస్టిస్ పొనుగోటి నవీన్రావు, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్కుమార్, జస్టిస్ టి.వినోద్కుమార్, జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయసేన్రెడ్డి, జస్టిస్ ఎం.లక్ష్మణ్, జస్టిస్కె.సురేందర్, జస్టిస్ ఎం.సుధీర్కుమార్, జస్టిస్ సి.వి.భాస్కర్రెడ్డి, జస్టిస్ ఈవీ.వేణుగోపాల్, జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ కె.శరత్, జస్టిస్ జె.శ్రీనివాసరావులను పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రధాన న్యాయమూర్తి జ్యోతిని వెలిగించి సమావేశాన్ని ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ప్రారంభోపన్యాసం చేశారు. నందిమేడారం కోర్టు పరిధిలో 281 సివిల్, 731 క్రిమినల్ కేసులున్నాయన్నాయన్నారు. మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, ధర్మారం, ధర్మపురి బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ డా.సర్వే సంగీత సత్యనారాయణ, సీపీ రెమా రాజేశ్వరి పాల్గొన్నారు. పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.సురేష్బాబు వందన సమర్పణ చేశారు.
నందిపంపుహౌస్ సందర్శన
కాళేశ్వరం పథకం ఆరో ప్యాకేజీలోని నంది పంపుహౌస్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు సందర్శించారు. స్థానిక పల్లె ప్రకృతివనంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ నవీన్రావు, జిల్లా ప్రధానన్యాయమూర్తి నాగరాజు, కలెక్టర్ సంగీత, జిల్లాలోని ఇతర కోర్టుల న్యాయమూర్తులు మొక్కలు నాటారు. తహసీల్దారు శ్రీనివాస్, ఎంపీడీవో జయశీల తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం