చెక్డ్యాం కోతలు.. సాగు భూముల్లో ఇసుక మేటలు
పచ్చని పంటలతో ఉండాల్సిన నేలతల్లి వరుణుడి ప్రకోపంతో గుంతలమయంగా మారింది. భూసారం అంతా కొట్టుకుపోయి రాళ్లను, ఇసుక మేటలను మిగిల్చింది.
న్యూస్టుడే, కాల్వశ్రీరాంపూర్
పోచంపల్లి చెక్డ్యాం వద్ద కోతకు గురైన పంట పొలాలు
పచ్చని పంటలతో ఉండాల్సిన నేలతల్లి వరుణుడి ప్రకోపంతో గుంతలమయంగా మారింది. భూసారం అంతా కొట్టుకుపోయి రాళ్లను, ఇసుక మేటలను మిగిల్చింది. పంటలతో పాటు మట్టి కొట్టుకుపోయింది. భారీ వర్షాల ధాటికి చెక్డ్యాములతో పాటు కరకట్టలు కొట్టుకుపోయాయి. ఫలితంగా సారవంతమైన భూములు కోతకు గురవడంతో పాటు వరి పంటలకు నష్టం వాటిల్లగా ప్రభుత్వ సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.
మీర్జంపేట రైతులకు అందని పరిహారం
కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట పరిధిలోని పోచంపల్లిలోని మానేరుపై రూ.11 కోట్లతో నిర్మించిన చెక్డ్యాం ఏడాది తిరగకముందే తెగిపోయింది. అధిక వర్షాలు, వరద ధాటికి చెక్డ్యాం కట్ట తెగిపోవడంతో మానేరు తీరాన పంట మునిగింది. గుత్తేదారు చెక్డ్యాంను నాణ్యతగా నిర్మించకపోవడంతోనే సుమారు 50 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు వేసి, కోతకు గురి కావడంతో భూములు సాగుకు పనికి రాకుండాపోయాయని రైతులు చెబుతున్నారు. చెక్ డ్యాం తెగి పంటలు కొట్టుకుపోయి ఇప్పటికి మూడేళ్లు గడిచినా పరిహారం అందలేదని వాపోతున్నారు.
ఏడాది గడవకముందే కూలిన చెక్డ్యాంలు
హుస్సేన్మియవాగుపై సుమారు రూ.17 కోట్లతో మడిపల్లి, పెగడపల్లి, కాల్వశ్రీరాంపూర్లో రెండు, పెద్దరాతుపల్లి చెక్డ్యాంలు మంజూరయ్యాయి. ఇందులో పెగడపల్లి, కాల్వశ్రీరాంపూర్ చెక్డ్యాంలు పూర్తయ్యాయి. ఏడాది తిరగకముందే గత వానాకాలం వర్షాలకు కొట్టుకుపోయాయి. దీంతో పంట భూములు కోతకు గురై, ఇసుక మేటలు వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తెగిపోయిన చెక్డ్యాంలు నాణ్యతగా నిర్మించాలని, చెక్డ్యాంలకు ఇరువైపులా కరకట్టలు పోయాలని రైతులు కోరుతున్నారు.
గుత్తేదారులతో తిరిగి నిర్మింపజేస్తాం
- నళినీకాంత్, నీటిపారుదల శాఖ ఏఈ
కాల్వశ్రీరాంపూర్ మండలం మానేరు, హుస్సేన్మియవాగుల పరిధిలో తెగిపోయిన చెక్డ్యాంలను తిరిగి నిర్మించే బాధ్యత గుత్తేదారులదే. ఎక్కడా పనులు పూర్తికాలేదు. వరద ఉద్ధృతితో చెక్డ్యాంలు కూలిపోయాయి. కూలిన నిర్మాణాల స్థానంలో కొత్తగా పనులు చేపట్టేలా, నష్టపోయిన రైతుల భూములు చదును చేసేలా గుత్తేదారులకు ఆదేశాలు జారీ చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం