logo

రోడ్డు ప్రమాదంలో హనుమాన్‌ దీక్షాపరుడి మృతి

ద్విచక్ర వాహనాన్ని, టిప్పర్‌ ఢీకొన్న సంఘటనలో హనుమాన్‌ దీక్షాపరుడు మృతి చెందిన సంఘటన చందుర్తి మండలం లింగంపేట-కట్టలింగపేట మధ్య సోమవారం చోటుచేసుకుంది.

Published : 28 Mar 2023 04:51 IST

రుద్రంగి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని, టిప్పర్‌ ఢీకొన్న సంఘటనలో హనుమాన్‌ దీక్షాపరుడు మృతి చెందిన సంఘటన చందుర్తి మండలం లింగంపేట-కట్టలింగపేట మధ్య సోమవారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన గడ్డం గంగారెడ్డి (70) అనే వృద్ధుడు, వేములవాడ నుంచి ద్విచక్ర వాహనంపై తాండ్య్రాలకు వస్తుండగా చందుర్తి మండలం లింగంపేటలో రోడ్డు పనుల కోసం కంకర తీసుకువస్తున్న టిప్పర్‌ వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని నిర్లక్ష్యంగా టిప్పర్‌ నడిపి గంగారెడ్డి మృతికి కారణమైన వ్యక్తిని శిక్షించి తమకు న్యాయం చేయాలంటూ కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో దాదాపు 2 గంటలు రాకపోకలు నిలిచిపోయాయి. చివరికి సీఐ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా వారిని చెదరగొట్టి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య గంగు, అయిదుగురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే గ్రామంలో సొంతంగా హనుమాన్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, హనుమాన్‌ దీక్షలో ఉండగా ప్రమాదంలో గంగారెడ్డి మృతి చెందడంతో కుటుంబీకులు బోరున విలపించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని