మరిన్ని విజయాలు సాధిద్దాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గుచూపాలి
రైతు దినోత్సవంలో మాట్లాడుతున్న కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల గ్రామీణం, తంగళ్లపల్లి, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవాన్ని సిరిసిల్ల పట్టణ పరిధిలోని చంద్రంపేట, బోనాల, తంగళ్ల్లపల్లి మండల కేంద్రంతోపాటు, బద్దెనపల్లి గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయశాఖ ముద్రించిన మన తెలంగాణ దేశానికి అన్నపూర్ణ, పంటలను నెల ముందస్తుగా సాగు చేద్దాం అనే కరపత్రాలను ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించి రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్) ఛైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ పడిగెల మానస, తహసీల్దార్ సదానందం, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
* సిరిసిల్ల పట్టణ పరిధిలోని బోనాల, చంద్రంపేట రైతు వేదికల్లో జిల్లా రైతు బంధు సమితి(రైబస) అధ్యక్షుడు గడ్డం నర్సయ్య ఆధ్వర్యంలో రైతు దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ర్యాలీగా రైతు వేదికల వద్దకు తరలివచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళ, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక డ్రైవ్
ఎల్లారెడ్డిపేట: వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, జిల్లాలో 57 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించి ఏఈవోలను నియమించిందని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి, రాచర్ల బొప్పాపూర్, అల్మాస్పూర్, వెంకటాపూర్ క్లస్టర్లలో శనివారం రైతు దినోత్సవం నిర్వహించారు. ఆదర్శ రైతులు, ఆయిల్పాం సాగు చేస్తున్న రైతులను సన్మానించారు. రాచర్ల గొల్లపల్లి క్లస్టర్ రైతు వేదికలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సీజన్లో జిల్లాలో 1.8 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. 2.5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఆయిల్పాం సాగుపై రైతులు దృష్టిసారించాలని, మొక్కలు, బిందు సేద్యం పరికరాలను రాయితీపై అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, రెండు మూడు రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మణ్రావు, ఎంపీపీ పిల్లి రేణుక, వైస్ ఎంపీపీ భాస్కర్, తహసీల్దారు జయంత్కుమార్, ఎంపీడీఓ చిరంజీవి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం