పెద్దపల్లి-నిజామాబాద్ మార్గానికి మహర్దశ
పెద్దపల్లి-నిజామాబాద్ 177 కిలోమీటర్ల రైలు మార్గానికి మంచి రోజులు రానున్నాయి. ఈ మార్గంలో వేగ పరిమితిని గంటకు 110 కిలోమీటర్లకు పెంచడంతో అనేక కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వేగ పరిమితిని పెంచడంతో సూపర్ఫాస్ట్ రైళ్లు నడిచే అవకాశం
పెద్దపల్లి రైల్వే స్టేషన్
న్యూస్టుడే, పెద్దపల్లి: పెద్దపల్లి-నిజామాబాద్ 177 కిలోమీటర్ల రైలు మార్గానికి మంచి రోజులు రానున్నాయి. ఈ మార్గంలో వేగ పరిమితిని గంటకు 110 కిలోమీటర్లకు పెంచడంతో అనేక కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
గడిచిన పదేళ్లలో ఉమ్మడి జిల్లావాసులకు రైల్వేపరంగా చెప్పుకోదగ్గ ప్రయోజనం చేకూరలేదు. కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండు సార్లు నడిచే తిరుపతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మినహా కొత్తగా మరో రైలు రాలేదు. కాచిగూడ నుంచి కరీంనగర్ వరకు ప్రస్తుతం నడుపుతున్న ప్యాసింజర్ రైలు వల్ల ఉమ్మడి జిల్లా వాసులకు పెద్దగా ప్రయోజనం లేదు. రైల్వే ట్రాక్ సామర్థ్యానికి అనుగుణంగా వివిధ స్టేషన్ల మధ్య గతంలో ఉన్న వేగ పరిమితిని ఏకీకృతం చేయడంతో ఈ మార్గంలో కొత్తగా రైళ్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఏర్పడింది.
పలు జిల్లాలకు ప్రయోజనం
పెద్దపల్లి-నిజామాబాద్ మార్గంలో రైళ్ల వేగ పరిమితి గంటకు 110 కిలోమీటర్లకు పెంచడం ద్వారా సూపర్ఫాస్ట్లతో పాటు అమృత్భారత్ రైళ్లను నడిపించేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ను నిజామాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా మళ్లించడం ద్వారా 41 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తిరుపతికి వెళ్లేందుకు మరో రైలు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ఆదిలాబాద్ నుంచి బయలుదేరే ప్రతి రైలు తిరిగి మన రాష్ట్రంలో ప్రవేశించేందుకు మహారాష్ట్రలో 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే కాజీపేట నుంచి పెద్దపల్లి, నిజామాబాద్ల మీదుగా ముంబాయికి వెళ్లే రెండు రైళ్లు కొవిడ్ అనంతరం రద్దయ్యాయి. వీటిని పునరుద్ధరించడంతో పాటు పెద్దపల్లి మీదుగా గుజరాత్, రాజస్థాన్ వైపు వెళ్లే పలు రైళ్లను ఇటువైపు మళ్లించే అవకాశముంది. హైదరాబాద్-దిల్లీ, హైదరాబాద్-పట్నా, జమ్ముతావి-చెన్నై మార్గంలో అమృత్భారత్ రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు రూపొందించింది. పెద్దపల్లి-నిజామాబాద్ మార్గంలోనూ నడిపితే ఆయా జిల్లాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.
ఏ మార్గంలో ఎంత వేగం?
పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు ప్రస్తుతం వేగపరిమితి గంటకు 100 కిలోమీటర్లుగా ఉంది. కరీంనగర్ నుంచి లింగంపేట, జగిత్యాల వరకు 75 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి నిజామాబాద్ వరకు గరిష్ఠ వేగపరిమితి 90 కిలోమీటర్ల వరకుంది. తాజాగా ఈ మార్గంలో వేగ పరిమితిని రైల్వేశాఖ 110కి పెంచింది. అలాగే బల్హార్షా, కాజీపేట సెక్షన్ల మధ్య గంటలకు 120 నుంచి 130 కిలోమీటర్లకు పెంచారు.
పునరుద్ధరణకు నోచుకోని రెండు రైళ్లు
కరోనా కంటే ముందు కాజీపేట నుంచి ముంబాయికి దాదర్, ఆనంద్వన్ ఎక్స్ప్రెస్లను, పుణేకు మరో రైలును నడిపేవారు. వీటిలో దాదర్ ఎక్స్ప్రెస్ పెద్దపల్లి, నిజామాబాద్ మీదుగా వెళ్తే మిగిలినవి బల్హార్షా మీదుగా నడిపించే వారు. అప్పటి చంద్రాపూర్ ఎంపీ హన్స్రాజ్ గంగారాం ఈ రైళ్లను నడిపేందుకు కృషి చేశారు. అప్పట్లో బల్హార్షాలో పిట్మెంట్(రైళ్ల ప్రాథమిక నిర్వహణ కేంద్రం) లేకపోవడంతో సదరు రైళ్లను కాజీపేట నుంచి నడిపించారు. కరోనా సమయంలో రద్దయిన ఈ రైళ్లలో రెండింటిని పునరుద్ధరించారు. వాటిలో ఆనంద్వన్ కాజీపేటకు బదులు ముంబాయి నుంచి బల్హార్షా వరకే నడుపుతున్నారు. ప్రస్తుతం కాజీపేట నుంచి నడుస్తున్న పుణే ఎక్స్ప్రెస్ను కూడా బల్హార్షా వరకే కుదించే అవకాశముంది. ఈ నెల 12న ప్రధాని చంద్రాపూర్లో బల్హార్షాలోని పిట్మెంట్ కేంద్రంతో పాటు పలు అమృత్భారత్ రైళ్లను ప్రారంభించే అవకాశముంది. ఇక దాదార్ ఎక్స్ప్రెస్ను ఇప్పటికీ పునరుద్ధరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురిని జిల్లా దాటించారు!
-
తెదేపాకు ఓటేశామని.. ఉపాధి పనులు నిలిపివేశారు
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
-
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
-
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు