మొదటిరోజు ఆరు నామినేషన్లు
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు
కరీంనగర్లో 2.. పెద్దపల్లిలో 4
నేడు దాఖలు చేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
ఈనాడు, కరీంనగర్, న్యూస్టుడే, రాంపూర్
భారాస అధినేత కేసీఆర్ నుంచి బీ ఫాం తీసుకుంటున్న కరీంనగర్ అభ్యర్థి వినోద్కుమార్, చిత్రంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేటీఆర్, జడ్పీ ఛైర్పర్సన్ విజయ తదితరులు
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు అందించగా.. పెద్దపల్లి స్థానం నుంచి నలుగురు స్వతంత్రులు దూడ మహిపాల్, దుర్గం రాజ్కుమార్, నూకల నవీన్, అక్కపాక తిరుపతి రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. కలెక్టరేట్ల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొదటి రోజు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపా, భారాసల తరపున అభ్యర్థులెవరూ నామినేషన్ వేయలేదు. శుక్రవారం ఈ మూడు పార్టీల నుంచి కొందరు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. భారాస అభ్యర్థులు బోయినపల్లి వినోద్కుమార్ (కరీంనగర్) కొప్పుల ఈశ్వర్ (పెద్దపల్లి) బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్)లు గురువారం హైదరాబాద్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫాంలను అందుకున్నారు. ఆయా లోక్సభ నియోజకవర్గ పరిధి ముఖ్య నేతలతో కలిసి భారాస కార్యాలయానికి వెళ్లిన అభ్యర్థులు సమీక్షలో పాల్గొన్నారు. పార్టీ అధినేత చేసిన సూచనలు, సలహాల ఆధారంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆరు రోజుల సందడి..
ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల సందడి కనిపించనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ బల ప్రదర్శనకు ఈ ఘట్టాన్ని వేదికగా మలచుకోబోతున్నారు. మొదట నామమాత్రంగా ఒక సెట్ను వేసి మరో రోజు మాత్రం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థులు ఆయా పార్టీల ముఖ్య నేతల్ని ఈ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని మిగతా రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. నామపత్రాల స్వీకరణ గడువు 25వ తేదీతో ముగియనుండటంతో ఆ మరుసటి రోజు నుంచి ఆయా లోక్సభ నియోజకవర్గ స్థానాల పరిధిలో భారీ సభలను నిర్వహించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు జాతీయ స్థాయి నేతలను ఆహ్వానిస్తుండగా.. భారాస పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావులతో రోడ్షోలను నిర్వహించబోతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా త్వరలోనే ఉమ్మడి జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవనున్నారు. ముఖ్యనేతల ప్రచారం తీరుతో అసలైన ఎన్నికల కోలాహలం అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో మరింతగా కనపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యూఆర్ కోడ్తో ఓపీ రిజిస్ట్రేషన్
[ 01-05-2024]
ఓపీ రిజిస్ట్రేషన్ కోసం వరుసలో నిల్చునే అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం నుంచి అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. -
లక్ష ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ లక్ష్యం
[ 01-05-2024]
‘ప్రతి ఇంటికి వెళ్లండి.. చేసిన ప్రగతిని చెప్పండి.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు లక్ష ఓట్ల ఆధిక్యతను అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
పదిలో మెరుగైన ఫలితాలు
[ 01-05-2024]
జిల్లాలో 11,380 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా 10,898 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 95.76 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. -
ఆ రెండు పార్టీలు ఒక్కటే
[ 01-05-2024]
కాంగ్రెస్, భాజపాలు ఒక్కటేనని భారాస నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, -
పదిలో ఎనిమిదో స్థానం
[ 01-05-2024]
జిల్లా పదో తరగతి ఫలితాల్లో అధికారుల సమష్టి సహకారంతో 96.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో 102 జడ్పీ ఉన్నత, 7 ఆదర్శ, 10 కస్తూర్బా, 6 మహాత్మా జ్యోతిబా, 1 తెలంగాణ గురుకులం, -
పోలింగ్ కేంద్రం.. సమగ్ర సమాచారం
[ 01-05-2024]
ఓటర్లకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ల జాబితా, స్లిప్పుల పంపిణీ నుంచి మొదలుకొని పోలింగు నిర్వహణ వరకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు -
పెరిగిన వినియోగం.. గృహజ్యోతికి దూరం
[ 01-05-2024]
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. విద్యుత్తు మీటర్లు గిర్రుగిర్రునా తిరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్పా జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. -
ఆ రెండు పార్టీలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాసలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలంగాణ జన సమితి(తెజస) వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన భాజపా, భారాసలు
[ 01-05-2024]
భారతీయ జనతా పార్టీ, భారాసలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. -
మోదీ బహిరంగ సభ విజయవంతానికి పిలుపు
[ 01-05-2024]
వేములవాడ పట్టణంలో మే 8న జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పిలుపునిచ్చారు. -
పది ఫలితాల్లో అదుర్స్
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. మంగళవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పది ఫలితాల్లో 98.27 శాతంతో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. -
శ్రమజీవి గుండె సడి వినండి
[ 01-05-2024]
ఎండనక వాననక కష్టాన్నే నమ్ముకొని జీవించే కార్మికులు.. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దాటినా హక్కుల కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. కష్టజీవులు, కర్మ వీరులకు కనీస వసతుల కల్పనలో పాలకులు విఫలమవుతున్నారు. -
గంజాయి చోరీ కేసులో ఆరుగురి అరెస్టు
[ 01-05-2024]
పోలీసుస్టేషన్ నుంచి గంజాయి దొంగిలించిన కేసులో మంగళవారం ఆరుగురిని అరెస్టు చేశారు. జగిత్యాల డీఎస్పీ డి.రఘుచందర్ వివరాలు వెల్లడించారు. -
వాట్సాప్.. ఎన్నికలపై అప్డేట్
[ 01-05-2024]
ఎన్నికల నిర్వహణ తీరుపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చర్యలు తీసుకుంటోంది. -
68 మందిపై అనర్హత వేటు
[ 01-05-2024]
2019లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేయగా వీరిలో వివిధ పార్టీల నుంచి ఏడుగురు బరిలో దిగగా, మిగతా వారు స్వతంత్రులు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km