ఆగని అక్రమ తవ్వకాలు..
రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
యథేచ్ఛగా మట్టి తరలింపు
ప్రశ్నార్థకంగా పాండవుల గుట్ట ఉనికి
న్యూస్టుడే, కాల్వశ్రీరాంపూర్
కాల్వశ్రీరాంపూర్లోని పాండవుల గుట్టను తవ్విన దృశ్యం
రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్ట అక్రమార్కులు తోడేస్తున్నారు. అడ్డుకునే వారే లేకపోవడంతో మట్టి దందా రాత్రి, పగలు తేడా లేకుండా నడుస్తుంది. రోజుకు రూ.లక్షల్లో అర్జిస్తూ ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ప్రజాప్రతినిధులు, యంత్రాంగం పోత్రాహంతో అక్రమ దందా సాఫీగా సాగుతోంది. గుట్టను గుల్ల చేస్తూ పచ్చదనానికి చోటు లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.
ఆక్రమణలు కూడా..
కాల్వశ్రీరాంపూర్లో సర్వే నంబరు 597లోని ప్రభుత్వ స్థలంలో సుమారు 200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పాండవుల గుట్ట విస్తరించి ఉంది. గుట్ట ప్రాంతంలోనే పోలీస్స్టేషన్, మార్కెట్ యార్డు, జూనియర్ కళాశాల, కేజీబీవీ, రెండు పడక గదుల నిర్మాణం, రైతువేదిక, పల్లెప్రకృతి వనం, విద్యుత్తు ఉపకేంద్రం, శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆలయానికి కొంత భూమిని కేటాయించారు. గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్లు ఎలాంటి అసైన్మెంట్ కమిటీ లేకుండా భూస్వాములకు, వ్యాపారులకు కొంత భూమిని పట్టా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పాండవుల గుట్ట ప్రాంతంలో అక్రమ పట్టాలతో కొందరూ, ఎలాంటి పట్టా లేకుండా ఇంకొందరూ కబ్జా చేసి సాగు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇవీ నిబంధనలు..
మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మొదట గనుల శాఖకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు సవ్యంగా ఉంటే ఎన్ఓసి(నో అబ్జక్షన్ సర్టిఫికెట్) సంబంధిత తహసీల్దార్కు పంపుతారు. అనంతరం గనులశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి ఒకేసారి నిర్ణీత మట్టి తవ్వకాల ప్రదేశాన్ని సర్వే చేయాలి. సదరు యజమాని సీఎఫ్ఈ, సీఎఫ్వో వంటి అనుమతులు తీసుకోవాలి. అనంతరం డెడ్రెంట్తో పాటు తవ్వే మట్టికి అదనంగా రాయల్టీ రూపంలో నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా మండల కేంద్రంలో మట్టి తవ్వకాలు ఆగడం లేదు.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
మట్టి అక్రమ తవ్వకాలతో ప్రభుత్వం రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతోంది. క్యూబిక్ మీటరుకు రూ.30 చొప్పున రాయల్టీ చెల్లించాలనే నిబంధన ఉంది. ఒక్కో ట్రాక్టరులో 2.85 క్యూబిక్ మీటర్ల మట్టి తరలిస్తుండగా.. ఈ లెక్కన ట్రాక్టర్కు 85.5 ఆదాయం ప్రభుత్వానికి రావాలి. లారీల్లో మట్టిని గృహాలు, వేడుక వేదికలు, వెంచర్లకు చేరవేస్తున్నారు. కానీ అక్రమార్కులు సర్కారు ఖజానాకు గండి కొడుతూ లాభం పొందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక అందించాం
పాండవుల గుట్టనుంచి అక్రమ మట్టి తరలింపు, భూకబ్జా తమ దృష్టికి వచ్చింది. ఈ విషయమై సంబంధిత ఆర్ఐకి మెమో జారీ చేశాం. పాండవుల గుట్టకు సంబంధించి 597 సర్వేనంబర్పై సర్వే చేయించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం.
జాహేద్ పాషా, తహసీల్దార్, కాల్వశ్రీరాంపూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా నారసింహుడి చందనోత్సవం
[ 19-05-2024]
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాల్లో శనివారం స్వామి వారికి చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సన్నద్ధం
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. -
కోడ్ ముగిస్తేనే ప్రగతి వేగిరం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాల పరిధిలో కలెక్టర్ మొదలు కింది స్థాయి ఉద్యోగి వరకు లోక్సభ ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. -
ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
చిగురుమామిడి మండలం నవాబుపేట, సైదాపూర్ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఇతరులు నివసిస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ పాఠశాలల్లోని ఎస్జీటీలు ఎ.మంగ, బి.సునీతను సస్పెండ్ చేసినట్లు డీఈవో జనార్దన్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అర చేతిలోనే కథలు చదివేద్దాం!
[ 19-05-2024]
వేసవి సెలవులను పిల్లలు ఆనందంగా గడుపుతుంటారు. రోజులో కొంత సమయాన్ని నైపుణ్య పెంపు, లేదా వికాస వృద్ధికి కేటాయిస్తే వారి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇంటింటా కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ ఏదో ఒకటి ఉంటున్న నేపథ్యంలో పఠనా నైపుణ్యాలు పెంచే వెబ్సైట్లు రూపుదిద్దుకున్నాయి. -
జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 19-05-2024]
కొడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ నాచుపల్లి కళాశాల ఐఎస్వో గుర్తింపు పొందినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కామాక్షి ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు ఈనెల 15న జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలను సందర్శించి సర్టిఫికేషన్ కోసం అవసరమైన రికార్డులను పరిశీలించారు. -
ఎప్సెట్లో మెరిశారు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. ఉత్తమ ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, ఆ ప్రాంతానికి పేరు తీసుకొచ్చారు. -
ప్రేమ పేరుతో మోసం చేసిన యువతిపై కేసు
[ 19-05-2024]
ప్రేమ పేరుతో డబ్బులు దండుకుని మోసం చేసిందని ఓ యువతిపై ఎల్ఎండీ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడి తండ్రి వివరాల ప్రకారం.. -
పీహెచ్సీ వైద్య సేవలకు నిరీక్షణ
[ 19-05-2024]
చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. పేరుకు 24 గంటల ఆసుపత్రి అయినా.. కనీసం పగటిపూట కూడా ఎవరూ ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి
[ 19-05-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రానికి శనివారం భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. -
ఎల్లంపల్లిలో తగ్గిన నీటి మట్టం
[ 19-05-2024]
ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీటిమట్టం పడిపోయింది. డెడ్ స్టోరేజీకి చేరువైంది. రానున్న కాలంలో తాగునీటికి ముప్పు పొంచి ఉంది. ఇన్ఫ్లో పెద్దగా లేకపోగా ప్రతిరోజు తాగునీటితో పాటు ఎన్టీపీసీకి నీటిని సరఫరా చేయాల్సి ఉండటంతో ఉన్న నిల్వ కొద్ది రోజుల్లోనే ఆవిరయ్యే అవకాశం ఉంది. -
స్కాన్ చేయండి.. నమోదు చేసుకోండి
[ 19-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపడటం, వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రోజురోజుకు చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఓపీ నమోదు కోసమే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 19-05-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు. -
మధుర ఫలం.. సమస్యలతో సతమతం
[ 19-05-2024]
మధుర ఫలమైన మామిడిని పండిస్తున్న రైతులకు చేదుఫలితాలే మిగులుతున్నాయి. మన మామిడికాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండున్నా ఏటికేడు పెరుగుతున్న చీడపీడలకు తోడుగా కాయల విక్రయంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందున అసంపూర్తిగానే మామిడిసాగును కొనసాగిస్తున్నారు. -
హైరిస్క్లో 52 శాతం మంది
[ 19-05-2024]
జీవనశైలిలో మార్పులతో కుటుంబంలో ఎవరూ ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలియని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.