ఆగని అక్రమ తవ్వకాలు..
రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
యథేచ్ఛగా మట్టి తరలింపు
ప్రశ్నార్థకంగా పాండవుల గుట్ట ఉనికి
న్యూస్టుడే, కాల్వశ్రీరాంపూర్
కాల్వశ్రీరాంపూర్లోని పాండవుల గుట్టను తవ్విన దృశ్యం
రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్ట అక్రమార్కులు తోడేస్తున్నారు. అడ్డుకునే వారే లేకపోవడంతో మట్టి దందా రాత్రి, పగలు తేడా లేకుండా నడుస్తుంది. రోజుకు రూ.లక్షల్లో అర్జిస్తూ ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ప్రజాప్రతినిధులు, యంత్రాంగం పోత్రాహంతో అక్రమ దందా సాఫీగా సాగుతోంది. గుట్టను గుల్ల చేస్తూ పచ్చదనానికి చోటు లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.
ఆక్రమణలు కూడా..
కాల్వశ్రీరాంపూర్లో సర్వే నంబరు 597లోని ప్రభుత్వ స్థలంలో సుమారు 200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పాండవుల గుట్ట విస్తరించి ఉంది. గుట్ట ప్రాంతంలోనే పోలీస్స్టేషన్, మార్కెట్ యార్డు, జూనియర్ కళాశాల, కేజీబీవీ, రెండు పడక గదుల నిర్మాణం, రైతువేదిక, పల్లెప్రకృతి వనం, విద్యుత్తు ఉపకేంద్రం, శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆలయానికి కొంత భూమిని కేటాయించారు. గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్లు ఎలాంటి అసైన్మెంట్ కమిటీ లేకుండా భూస్వాములకు, వ్యాపారులకు కొంత భూమిని పట్టా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పాండవుల గుట్ట ప్రాంతంలో అక్రమ పట్టాలతో కొందరూ, ఎలాంటి పట్టా లేకుండా ఇంకొందరూ కబ్జా చేసి సాగు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇవీ నిబంధనలు..
మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మొదట గనుల శాఖకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు సవ్యంగా ఉంటే ఎన్ఓసి(నో అబ్జక్షన్ సర్టిఫికెట్) సంబంధిత తహసీల్దార్కు పంపుతారు. అనంతరం గనులశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి ఒకేసారి నిర్ణీత మట్టి తవ్వకాల ప్రదేశాన్ని సర్వే చేయాలి. సదరు యజమాని సీఎఫ్ఈ, సీఎఫ్వో వంటి అనుమతులు తీసుకోవాలి. అనంతరం డెడ్రెంట్తో పాటు తవ్వే మట్టికి అదనంగా రాయల్టీ రూపంలో నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా మండల కేంద్రంలో మట్టి తవ్వకాలు ఆగడం లేదు.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
మట్టి అక్రమ తవ్వకాలతో ప్రభుత్వం రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతోంది. క్యూబిక్ మీటరుకు రూ.30 చొప్పున రాయల్టీ చెల్లించాలనే నిబంధన ఉంది. ఒక్కో ట్రాక్టరులో 2.85 క్యూబిక్ మీటర్ల మట్టి తరలిస్తుండగా.. ఈ లెక్కన ట్రాక్టర్కు 85.5 ఆదాయం ప్రభుత్వానికి రావాలి. లారీల్లో మట్టిని గృహాలు, వేడుక వేదికలు, వెంచర్లకు చేరవేస్తున్నారు. కానీ అక్రమార్కులు సర్కారు ఖజానాకు గండి కొడుతూ లాభం పొందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక అందించాం
పాండవుల గుట్టనుంచి అక్రమ మట్టి తరలింపు, భూకబ్జా తమ దృష్టికి వచ్చింది. ఈ విషయమై సంబంధిత ఆర్ఐకి మెమో జారీ చేశాం. పాండవుల గుట్టకు సంబంధించి 597 సర్వేనంబర్పై సర్వే చేయించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం.
జాహేద్ పాషా, తహసీల్దార్, కాల్వశ్రీరాంపూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ నిర్మాణాలపై బల్దియా నజర్
[ 15-05-2024]
కరీంనగర్ నగర పాలక పరిధిలో నూతన భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా నిర్మిస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా భవనాలు చకచకా నిర్మిస్తుండగా కనీసం పర్యవేక్షణ కూడా చేయడం లేదు. అక్రమ లేఅవుట్లతో అనర్థమని తెలిసినా అదేదీ పరిగణనలోకి తీసుకోకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. -
స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతర నిఘా
[ 15-05-2024]
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత కోసం నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలకు సోమవారం రాత్రి వరకు చేరుకున్నాయి. -
గొర్రెల పంపిణీ లేనట్లేనా!
[ 15-05-2024]
కొత్త రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం నిలిపివేయనున్నట్లు తాజాగా తీసుకున్న నిర్ణయాల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి ఇప్పటికే డీడీలు చెల్లించిన వారందరికీ తిరిగి డబ్బులు వాపసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఎవరి లెక్కలు వారివే!
[ 15-05-2024]
‘ఫలానా మండలంలో మనకే మంచి పట్టు ఉంది.. అక్కడ బాగానే ఓట్లు పడ్డాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న విధంగానే కొందరు ఓటర్లు మనవైపే ఉన్నారు.. మరో మండలంలో మనకు ఆదరణ కాస్త తక్కువైంది.’.. అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓట్ల లెక్కలేసుకుంటున్నారు. -
8,34,164 మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. దేశ చరిత్రలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం ఎంతగా ప్రచారం చేసినప్పటికీ దాని వినియోగంలో మాత్రం చాలా మంది దూరంగా ఉంటున్నారు. -
ధన్వాడలో ఉప ముఖ్యమంత్రి పూజలు
[ 15-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. -
తీరిక దొరికింది ఇలా..
[ 15-05-2024]
ఎన్నికల షెడ్యూలు వెలువడింది మొదలు పోలింగ్ వరకు అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడిపారు. -
ఓటెత్తిన నారీమణులు
[ 15-05-2024]
ఈసారి లోక్సభ ఎన్నికల్లో మహిళలు ఓటు హక్కు వినియోగంలో హవా చాటారు.. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువ ఓటుహక్కు కలిగి ఉండగా.. వినియోగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటారు. -
చికిత్స పొందుతూ జడ్పీటీసీ మాజీ సభ్యుడి మృతి
[ 15-05-2024]
జూలపల్లి జడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటకుల నర్సయ్య(48) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 10న నర్సయ్య ఇంట్లో తీవ్ర గాయాలతో అచేతనావస్థలో పడి ఉండటంతో గమనించిన బంధువులు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. -
‘కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన కాంగ్రెస్’
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. -
నగదు ప్రవాహానికి అడ్డుకట్ట
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రలోభాల నియంత్రణకు ఎన్నికల సంఘం నియమించిన నిఘా బృందాల తనిఖీల్లో రూ.9.82 కోట్ల సొత్తు పట్టుబడింది. అధికార యంత్రాంగం చాకచాక్యంగా వ్యవహరించడంతో డబ్బు ప్రవాహనానికి అడ్డుకట్ట వేసినట్లయింది. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో?
[ 15-05-2024]
సింగరేణి సంస్థ గడచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
సర్వే చేశారు... పనులు మరిచారు
[ 15-05-2024]
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. -
లక్ష మెజారిటీ ఖాయం : జీవన్రెడ్డి
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెట్పల్లి మండలం వేంపేటలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 15-05-2024]
రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే కేంద్రప్రభుత్వ పీఎంకిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చేరేందుకు జిల్లాలోని వేలాదిమంది రైతులు అయిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. -
మృత్యు మలుపు
[ 15-05-2024]
మేడిపల్లి జాతీయ రహదారిపై ఏటా ప్రమాదాల రూపంలో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. సరాసరి నెలరోజులకు ఒక ప్రాణం ఏదో ప్రమాదంలో గాలిలో కలసిపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
-
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..
-
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
-
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
-
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
-
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్