logo

ఇంటి నుంచే ఓటు ప్రారంభం

ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా జిల్లాలో తొలిరోజు 320 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Published : 04 May 2024 04:46 IST

జగిత్యాల, కోరుట్ల, న్యూస్‌టుడే: ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా జిల్లాలో తొలిరోజు 320 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికి మించి అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు హోం ఓటింగ్‌ కోసం అర్హులు కాగా జిల్లాలో 849 మంది ఇంటి నుంచే ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 374 మంది కోరుట్లలో 216, ధర్మపురి నియోజకవర్గంలో 259 మంది హోం ఓటింగ్‌ కోసం అర్హులుగా గుర్తించగా జిల్లా కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషా జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారి ఇంటికి వెళ్లి ఓటు వేయించేందుకు 36 బృందాలను ఏర్పాటు చేశారు. ఈనెల 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. పోలింగ్‌ సిబ్బంది మొదటిసారి ఇళ్లకు వెళ్లినప్పుడు దరఖాస్తు చేసుకున్న ఓటర్లు లేకపోతే ఈనెల 8న మరో అవకాశం కల్పిస్తారు. ఇంటి నుంచి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏదైనా కారణంతో ఓటు హక్కు వినియోగించుకోకుంటే పోలింగ్‌ రోజు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనర్హులు అవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని