logo

మావోయిస్టు నేతకు అంతిమ వీడ్కోలు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో ప్రజా సంఘాలు, పౌర హక్కుల నాయకులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో మావోయిస్టు నేత చీమల నర్సయ్య అలియాస్‌ జోగన్న అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు.

Published : 04 May 2024 04:50 IST

పాలకుర్తి, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో ప్రజా సంఘాలు, పౌర హక్కుల నాయకులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో మావోయిస్టు నేత చీమల నర్సయ్య అలియాస్‌ జోగన్న అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో అబూఝ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నర్సయ్య మృతిచెందిన విషయం విదితమే. ఆయన మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌ నుంచి శుక్రవారం ఉదయం స్వగ్రామమైన జయ్యారం గ్రామానికి ప్రత్యేక అంబులెన్సులో తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూసిన నర్సయ్య సోదరి రాజక్క బోరున విలపించింది. అంతిమ యాత్రలో ప్రజా సంఘాల నాయకులు, పౌర హక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు పాల్గొన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని