నేను ఈవీఎం.. 13న కలుద్దాం
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు పోలింగ్ శాతం పెంపునకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
న్యూస్టుడే, మార్కండేయకాలనీ (గోదావరిఖని): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు పోలింగ్ శాతం పెంపునకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గోదావరిఖని నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్ నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. అటు వైపు వెళ్లేవారు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
నేటి తరానికి మీరే స్ఫూర్తి
న్యూస్టుడే, కరీంనగర్ కలెక్టరేట్: దివ్యాంగులు, ఎనభై అయిదేళ్లు దాటిన వృద్ధుల కోసం ప్రభుత్వం ఇంటి వద్ద ఓటేసే అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా శుక్రవారం కరీంనగర్ మంకమ్మతోటలోని వి.జగన్నాథం ఇంటికి పోలింగ్ సిబ్బంది వెళ్లి ప్రక్రియ పూర్తి చేశారు. వృద్ధుడు ఓటు వేస్తుండగా కలెక్టర్ పమేలా సత్పతి, ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా, అదనపు కలెక్టర్ ప్రఫుల్దేశాయ్ ఆసక్తిగా తిలకిస్తున్న దృశ్యమిది.
వారం రోజులు.. ప్రచార వ్యూహాలు
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్క్యాంపు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరగనుండగా 11వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. సమయం తక్కువగా ఉండటంతో నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఓవైపు ఆయా పార్టీల ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, భారాస అధినేత కేసీఆర్ జిల్లాకు రాగా ప్రధాని మోదీ సహా ప్రధాన పార్టీల నేతలు త్వరలో పర్యటించనున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓవైపు విస్తృతంగా ప్రచారం చేస్తూనే మధ్యమధ్యలో పార్టీకి చెందిన ముఖ్యులతో సమావేశమవుతూ సభలు, సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
- ప్రచార అంకం చివరి దశలో ఓటర్లు, సంఘాలు, వర్గాలకు తాయిలాలు అందించే వీలుండటంతో సంబంధిత గంపగుత్త సమాచారం సేకరించి సిద్ధం చేశారు. తాయిలాలతో ఆకట్టుకోవటం, అవతలి వారి ప్రలోభాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయా పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి.
- సామాజిక మాధ్యమాల్లో తమకు అనుకూలంగా ఫొటోలు, వీడియోలతో కూడిన సందేశాలను విరివిగా పోస్టు చేస్తుండగా ఎదుటివారి లోపాలు, బలహీనతలను కూడా ఎత్తిచూపేలా ఉన్న వీడియోలను వైరల్ చేస్తున్నారు. వాయిస్ మెయిల్ ద్వారా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు.
- తమ పార్టీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను ఓటర్లకు వివరిస్తూనే తమను గెలిపించకుంటే జరిగే నష్టాలంటూ మరికొన్ని అంశాలను ఓటర్లకు వివరిస్తున్నారు. ఎవరికి ఓటేయాలో తెలిపేలా లాభనష్టాలను బేరీజు వేస్తున్నారు. కార్మికులు, మహిళా, యువజన, రైతు సంఘాలు, ఇతరత్రా గ్రూపులను ప్రసన్నం చేసుకోవడానికి నజరానాలు, మందు విందులతోనూ ఆకట్టుకునే యత్నాలు జోరందుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్