రెండు సభలతో కాంగ్రెస్ జోరు
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించడం.. సీఎం రేవంత్రెడ్డి హాజరవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.. నిర్ణీత సమయానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటలపాటు సభలు ఆలస్యమైనా ప్రజలు సీఎం ప్రసంగానికి ఉత్సాహంతో స్పందించారు.
ఉమ్మడి జిల్లాభివృద్ధికి తోడ్పాటునిస్తానని సీఎం హామీ
కరీంనగర్, పెద్దపల్లి (ఈనాడు), సిరిసిల్ల (ఈనాడు డిజిటల్), వెల్గటూర్, ధర్మారం (న్యూస్టుడే) : కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించడం.. సీఎం రేవంత్రెడ్డి హాజరవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.. నిర్ణీత సమయానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటలపాటు సభలు ఆలస్యమైనా ప్రజలు సీఎం ప్రసంగానికి ఉత్సాహంతో స్పందించారు.. సాయంత్రం 3 గంటలకు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లికి సీఎం రావాల్సి ఉండగా సాయంత్రం 6.30 గంటలకు వేదికపైకి వచ్చారు. ఇక్కడి సభ పూర్తయిన తరువాత రోడ్డు మార్గం ద్వారా సిరిసిల్లలోని జనజాతర సభకు హాజరయ్యారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన సభ రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. రాత్రి లోపు రెండుచోట్ల సభలు పూర్తవుతాయనే ఉద్దేశంతో లైట్లు అమర్చలేదు. సీఎం పర్యటన ఆలస్యమవడంతో అప్పటికప్పుడు రెండు చోట్ల లైట్లు అమర్చారు. రేవంత్రెడ్డి వేదికపైకి వచ్చిన సమయంలో ప్రజలు, కార్యకర్తలు ఈలలు, కేరింతలతో అభిమానం చాటుకున్నారు. కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు, పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీలను ఆశీర్వదించాలని సీఎం ఓటర్లను కోరారు. వీరిద్దరిని మంచి మెజారిటీతో గెలిపిస్తే అడిగిన అభివృద్ధి ఫలాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తనకోసం నిరీక్షించిన ప్రజలకు రెండుచోట్ల సీఎం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ గడ్డ కాంగ్రెస్కు అడ్డా..
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు, కరీంనగర్ పరిధిలో నాలుగు స్థానాలను కాంగ్రెస్కు అందించి ఈ గడ్డను కాంగ్రెస్కు అడ్డాగా మార్చారని సీఎం తన ప్రసంగంలో గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మంథని ప్రాంతం నుంచి పీవీ, శ్రీపాదరావులతోపాటు పెద్దపల్లి ప్రాంతంలో వెంకటస్వామి చేసిన సేవల్ని కొనియాడారు. ధర్మపురి లక్ష్మీనర్సింహాస్వామి పుణ్యక్షేత్రానికి ఎన్నికల తరువాత వస్తానని సీఎం చెప్పారు. భారాస అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్, వినోద్కుమార్లు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వినోద్కుమార్ అపర మేధావని.. బడి సంజయ్ అరగుండు మేధావని విమర్శించారు. కరీంనగర్లో అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును గెలిపించాలని సీఎం కోరారు. అభ్యర్థికి లక్ష ఓట్ల ఆధిక్యత ఇస్తామని ప్రజలచేత సీఎం అనిపించారు. విప్లు అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వివేక్ స్థానిక సమస్యలను వివరించారు. పెద్దపల్లి అభ్యర్థి వంశీని రెండు లక్షల ఓట్లతో గెలిపించి తనవద్దకు తీసుకొస్తే మీరు కోరిన హామీలన్నింటిని నెరవేర్చి ఉమ్మడి జిల్లాకు కావాల్సిన నిధుల్ని అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్బాబు హెలికాప్టర్లో సబాస్థలికి వచ్చారు.
భారాస కార్పొరేటర్ల చేరిక
కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గంలోని 11 మంది భారాస కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడితోపాటు మాజీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం రాత్రి సిరిసిల్లలో జరిగిన జనజాతర ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ వారికి పార్టీ కండువాలు కప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM