దేవుళ్ల పేరుతో రాజకీయాలు వద్దు: వినోద్
కరీంనగర్కు స్మార్ట్సిటీని తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నిలిపిన తాను ఎంపీగా గెలిచాక నగర రూపురేఖలను మరింతగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు భారాస ఎంపీ అభ్యర్థి బోయిపల్లి వినోద్కుమార్ తెలిపారు.
మాట్లాడుతున్న భారాస అభ్యర్థి, పక్కన ఎమ్మెల్యే కమలాకర్
రాంపూర్ (కరీంనగర్), రామడుగు, గంగాధర: కరీంనగర్కు స్మార్ట్సిటీని తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నిలిపిన తాను ఎంపీగా గెలిచాక నగర రూపురేఖలను మరింతగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు భారాస ఎంపీ అభ్యర్థి బోయిపల్లి వినోద్కుమార్ తెలిపారు. ప్రచారంలో భాగంగా శనివారం భగత్నగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి మాట్లాడారు. ఇప్పటికే అనేక పనులు జరిగాయని.. భారాస గెలిస్తే మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని వివరించారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. కాంగ్రెస్ అసమర్థతోనే రాష్ట్రంలో కరువు ఏర్పడిందని, చంద్రబాబు, రేవంత్రెడ్డి కలిసి తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలిపే కుట్ర చేస్తున్నారన్నారు. మరో వైపు నదుల అనుసంధానం పేరుతో కేంద్రం కుట్రపన్నుతుందని చెప్పారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు కీలకమని, ఇందులో భారాస అఖండ విజయం సాధిస్తుందన్నారు. మేయర్ వై.సునీల్ రావు, భారాస నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పలువురు భారాస కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, స్థానికులు హాజరయ్యారు. వినోద్కుమార్ గోపాల్రావుపేట రోడ్షోలో ప్రసంగించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించటానికి భారాసకు మద్దతు పలకాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వనరులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పార్లమెంటులో ఆన్యాయాన్ని ప్రశ్నించే గళం భారాసకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో నలుగురు భాజపా ఎంపీలున్నా కొత్తగా ఒక్క నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రామడుగు సింగిల్విండో ఛైర్మన్ వెంకటేశ్వర్రావు, నాయకులు పాల్గొన్నారు. గంగాధరలో మాట్లాడుతూ భాజపా, కాంగ్రెస్లను నమ్మి మరోసారి మోసపోవద్దని వివరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఎంపీగా వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, భారాస జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఇన్ఛార్జి భూపతిరెడ్డి, ఎంపీపీ శ్రీరాం మధుకర్, మండలాధ్యక్షుడు నవీన్రావు, సింగిల్విండో అధ్యక్షుడు బాలగౌడ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్