logo

పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య

మండలంలోని కోర్కల్‌కు చెందిన పూదరి కుమార్‌(38) పెళ్లి కాదేమోననే బెంగతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వీణవంక ఎస్‌ఐ తిరుపతి తెలిపారు.

Updated : 06 May 2024 06:34 IST

వీణవంక, న్యూస్‌టుడే: మండలంలోని కోర్కల్‌కు చెందిన పూదరి కుమార్‌(38) పెళ్లి కాదేమోననే బెంగతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వీణవంక ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కుమార్‌ పెళ్లి కాలేదని మనస్తాపం చెంది ఈ నెల 4న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని తల్లి ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.


రైలు కింద పడి వృద్ధురాలు...

జమ్మికుంట : జమ్మికుంట-బిజిగిరిషరీఫ్‌ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం గుర్తుతెలియని వృద్ధురాలు(60) రైల్వే ట్రాక్‌పై కూర్చొని రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని రామగుండం రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతి తెలిపారు. వృద్ధురాలు లేత పసుపు రంగు చీర ధరించిందని చెప్పారు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వాసుపత్రిలో భద్రపర్చినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని