అస్త్రం సంధించి.. ఆదర్శంగా నిలిచి..
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఓటు అస్త్రాన్ని సంధించడంలో పల్లెలు ముందు వరుసలో నిలుస్తున్నాయి.
ఓటు హక్కు వినియోగంలో గ్రామీణుల చైతన్యం
గత ఎన్నికల్లో పెద్దపల్లిలో ఓటింగ్ సరళి
మంథని నియోజకవర్గంలో ఎండలో బారులు తీరిన ఓటర్లు (పాతచిత్రం)
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఓటు అస్త్రాన్ని సంధించడంలో పల్లెలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఓటుహక్కు వినియోగించుకోవడానికి విద్యావంతులైన పట్నం వాసులు బద్దకిస్తుంటే గ్రామీణ ప్రాంత ప్రజలు బారులు తీరుతున్నారు. బతుకుదెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా బాధ్యతను మరచిపోకుండా సొంతూరి బాట పడుతున్నారు.
గత లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ ఓటర్లే ఆదర్శంగా నిలిచారు. గరిష్ఠంగా రామగుండం సెగ్మెంటులోని రాయదండిలో అత్యధికంగా 92.63 శాతం నమోదు కాగా పెద్దపల్లి పట్టణ సమీపంలోని బంధంపల్లిలో అత్యల్పంగా 2.47 శాతం పోలింగ్ నమోదైంది.
పల్లె జనం.. సంకల్ప బలం
రాయదండి పోలింగ్ కేంద్రంలో 188 మంది పురుషులు, 192 మంది మహిళలు కలిపి మొత్తం 380 మంది ఓటర్లుండగా 352 మంది ఓటేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెజ్జల్లో 91.19 శాతం, సోనాపూర్లో 90.95 శాతంతో రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఈ మూడు గ్రామాల్లో జనాభా తక్కువగా ఉన్నా ఐకమత్యం, ఓటు వేయాలనే సంకల్పం బలంగా ఉండటంతో అధిక పోలింగ్ శాతం నమోదైంది. చెన్నూర్లో 48.31 శాతం, మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్లో 29.64 శాతం, రామగుండంలోని శాంతినికేతన్ పోలింగ్ కేంద్రంలో 27.48 శాతం నమోదైంది. పట్టణ, నగర ప్రాంత ఓటర్లు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటం పోలింగ్ శాతం పడిపోవడానికి కారణమవుతోంది.
115 చోట్ల 80 శాతానికి పైగా..
అయిదేళ్ల కిందట పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో 14,78,062 మంది ఓటర్లుండగా 9,67,801 (65 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 4,83,726 మంది, మహిళలు 4,84,059 మంది, 16 మంది ఇతరులున్నారు. ఏడు సెగ్మెంట్ల పరిధిలోని 115 పోలింగ్ కేంద్రాల్లో 80 శాతం కంటే అధికంగా పోలింగ్ నమోదైంది. బెల్లంపల్లిలో 28 చోట్ల, చెన్నూర్లో 32, మంచిర్యాలలో 7, ధర్మపురిలో 8, రామగుండంలో 1, మంథనిలో 25, పెద్దపల్లిలో 14 పోలింగ్ కేంద్రాల్లో నమోదు ఉంది. రామగుండం, మంచిర్యాల నియోజకవర్గాల్లోని ఎక్కువ చోట్ల 70 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM