ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా.. నిరంతర నిగా
స్వేచ్ఛాయుత, సమర్థవంత ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సాంకేతిక విధానాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి ఘర్షణలు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.
పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సేవలు
పెద్దపల్లి జిల్లాలో పోలింగ్ కేంద్రం భవనానికి బిగిస్తున్న సీసీ కెమెరా (పాతచిత్రం)
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: స్వేచ్ఛాయుత, సమర్థవంత ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సాంకేతిక విధానాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి ఘర్షణలు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించేందుకు వెబ్కాస్టింగ్ చేయాలని నిర్ణయించింది. ఇంటర్నెట్ అనుకూలంగా లేని మారుమూల ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా సీసీ కెమెరాల్లో వీక్షించనున్నారు. గతంలో ఇంజినీరింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకోగా ఇటీవల జరిగిన శాసనభ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఒకే ప్రైవేటు ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.
దొంగ ఓట్లను నివారించడానికే..
ఎన్నికల్లో ప్రత్యర్థులు పరస్పర ఘర్షణలకు పాల్పడుతున్నారు. నగదు, మద్యం, ఇతర కానుకలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఒకరికి బదులు మరొకరు వచ్చి దొంగ ఓటు వేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. అల్లర్లు, హింసాత్మక సంఘటనలను తావులేకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం 2018లో తొలిసారిగా వెబ్కాస్టింగ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు నిరంతరం ఆన్లైన్లో నిక్షిప్తమవుతోంది. వీటిని జిల్లా కేంద్రంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అనుసంధానిస్తారు. ఎక్కడైనా అల్లర్లు, ఘర్షణలు జరిగితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దనున్నారు.
జిల్లా స్థాయిలో పర్యవేక్షణ
- సమస్యాత్మక ప్రాంతాలు, వెయ్యి ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తారు.
- ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువత వివరాలు సేకరిస్తున్నారు.
- ఎంపికైన యువతకు వెబ్కాస్టింగ్ ఎలా చేయాలనే అంశంపై శిక్షణ ఇవ్వనున్నారు.
- జిల్లా స్థాయిలో అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.
- ఏదైనా సంఘటనలు జరిగితే వీడియో చిత్రాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.
అంతర్జాల సేవలే అసలు సమస్య
పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్పై ఇంటర్నెట్ సేవలు ప్రభావం చూపుతున్నాయి. పల్లెల్లో 4జీ, 5జీ సేవలు అందుబాటులో రాలేవు. సిగ్నల్ సక్రమంగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడంలేదు. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయంగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఒకటి రెండ్రోజుల్లో జాబితా కొలిక్కిరానుంది. ఉమ్మడి జిల్లాలో 2019 ఎన్నికల్లో 4,669 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 2,742 వెబ్కాస్టింగ్, 2,219 చోట్ల సీసీ కెమెరాలను బిగించారు. ప్రస్తుతం వీటి సంఖ్య పెరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు
[ 18-05-2024]
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారికి చందనోత్సవాన్ని నిర్వహించారు. -
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు