గోసాయి కనుమా..వెండితెర చిరునామా!
పక్కనే హోరెత్తుతూ ప్రవహించే కావేరి నది.. ఒడ్డునే విశాలమైన వేదిక.. ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా నిర్మించిన మెట్లు- స్నాన ఘట్టాలు..సమీపంలోనే కనుచూపుమేరలో పచ్చటి పొలాలు..అక్కడక్కడా కొబ్బరితోటలు..ఇంతకంటే అద్భుత దృశ్యాలు అవసరమా? అందుకే సినీ దర్శకులకు అచ్చుమెచ్చు ప్రాంతంగా గుర్తింపు పొందింది. జిల్లాలోని ప్రముఖ చారిత్రక పట్టణమైన శ్రీరంగపట్టణకు
వేలాది చిత్రాలకు లొకేషన్
నది మధ్యలోని బండరాళ్లపై తీసిన సన్నివేశాలు ఎన్ని సినిమాల్లో కనిపిస్తాయో
మండ్య, న్యూస్టుడే: పక్కనే హోరెత్తుతూ ప్రవహించే కావేరి నది.. ఒడ్డునే విశాలమైన వేదిక.. ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా నిర్మించిన మెట్లు- స్నాన ఘట్టాలు..సమీపంలోనే కనుచూపుమేరలో పచ్చటి పొలాలు..అక్కడక్కడా కొబ్బరితోటలు..ఇంతకంటే అద్భుత దృశ్యాలు అవసరమా? అందుకే సినీ దర్శకులకు అచ్చుమెచ్చు ప్రాంతంగా గుర్తింపు పొందింది. జిల్లాలోని ప్రముఖ చారిత్రక పట్టణమైన శ్రీరంగపట్టణకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని గోసాయిఘాట్కు ఓ ప్రత్యేక ఉంది. అక్కడ వేలాది సినిమాల చిత్రీకరణలు కొనసాగాయని స్థానికులు చెబుతారు. ప్రాచీన ఆలయం, అనేక మంటపాలు..ప్రత్యేకమైన సెట్ల కోసం రూ. లక్షల్లో వ్యయం చేయాల్సిన శ్రమ ఏమాత్రం ఉండదు. ఐటీ వర్గాలు చెబుతున్నట్లు ప్లగ్ అండ్ వర్క్ తరహాలో గోసాయి ఘాట్లో కెమెరాల్ని అమర్చి ఎంచక్కా చిత్రీకరణల్ని కొనసాగించడమే. సినిమాల కోసమే అన్నట్లుగా అక్కడి నిర్మాణాలున్నాయి. మరెలాంటి మార్పులు లేకుండానే అనేకమంది దర్శకులు గోసాయి ఘాట్లో తమ సినిమాల చిత్రీకరణల్ని చేపడుతుంటారని చెబుతారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ...ఇలా అనేక భాషల సినిమాల చిత్రీకరణలకు గోసాయి ఘాట్ వేదికగా ఉందని చెబుతారు. సమీపంలోనే ఉన్న మైసూరు నగరంలో బస చేసి ఉదయం వచ్చి సాయంత్రానికి చిత్రీకరణల్ని పూర్తి చేసుకుని వెనుతిరిగేందుకు వీలుంటున్నందునే అనేక మంది ఈ ప్రాంతానికి వస్తుంటారని తెలిపారు. జిల్లాలోని మేలుకోటె, కరిఘట్ట, శ్రీరంగపట్టణ ప్రాంతాలన్నీ సినిమాల చిత్రీకరణలకు ఏర్చికూర్చినట్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ఒకవిధంగా ఈ పరిసరాల్లోనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకునేందుకు అనువైన అన్ని లొకేషన్లూ లభిస్తాయంటారు. అన్నట్లు ఈ ఘాట్కు సమీపంలోనే అత్యంత శక్తిమంతమైన దేవతగా భావించే నిమిషాంబ ఆలయం కూడా ఉంది. కోరిన కోర్కెల్ని తీర్చే కల్పవల్లిగా అమ్మవారికి గుర్తింపు ఉంది.
గోసాయి ఘాట్ విహంగ వీక్షణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్