మలివిడత మెట్రో ఆలస్యమే
భారతీయుల సిలికాన్సిటీ.. బెంగళూరు నగర నాజూకు ప్రజా రవాణా వ్యవస్థ మలివిడత పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోలేదు.
బయ్యప్పనహళ్లి- వైట్ఫీల్డ్ మార్గంలో ప్రయోగాత్మకంగా మెట్రో పరుగు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : భారతీయుల సిలికాన్సిటీ.. బెంగళూరు నగర నాజూకు ప్రజా రవాణా వ్యవస్థ మలివిడత పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోలేదు. నగరంలోని శాస్త్ర- జీవ సాంకేతిక (ఐటీ, బీటీ) ఉద్యోగుల కార్యాలయాలు విస్తరించిన ఎలక్ట్రానిక్సిటీ, ఇతర ప్రాంతాలకు నమ్మ మెట్రోరైల్లో సంచరించేందుకు మరో నాలుగు నెలల పాటు ఎదురు చూడాల్సిందే. బయ్యప్పనహళ్లి- వైట్ఫీల్డ్ మధ్య 15.50 కిలోమీటర్ల మెట్రో రైలు సంచారం ముందుగా నిర్ణయించిన దానికన్నా మరో నెల జాప్యమవుతుందని బీఎంఆర్సీఎల్ అధికారులు అంగీకరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ మార్గంలో నాజూకు వాహనాలు తిరిగేలా ముందుగా పథకాలను సిద్ధం చేశారు. అందుకు అనువుగానే ప్రయోగాత్మకంగా అక్టోబరు 21 నుంచి పట్టాలపై ప్రయోగాలు మొదలయ్యాయి. మెట్రో రైళ్లు తొలుత నిదానంగా.. ప్రస్తుతం వేగంగా పరుగులు తీస్తూ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయి. ఈ పరిధిలో నిర్మిస్తున్న 13 ప్రయాణ ప్రాంగణాల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. పలు చోట్ల అంతర్గత నిర్మాణాలు మొదలుపెట్టాలి. మార్చి రెండో వారంలోనే కొత్త రవాణా సేవలు మొదలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వైట్ఫీల్డ్, ఐటీపీఎల్, హుడి తదితర ప్రాంతాల్లో ఐటీ, బీటీ సంస్థల కార్యాలయాలు ఎక్కువ. వాటిల్లో పని చేసే ఉద్యోగులు బయ్యప్పనహళ్లి వరకు మెట్రో రైల్లో వచ్చి అక్కడి నుంచి నేరుగా బీఎంటీసీ బస్సుల్లో తమ కార్యాలయాలకు వెళ్తున్నారు. నేరుగా మెట్రో రైలు వైట్ఫీల్డ్కు సంచరిస్తే ఐటీ, బీటీ ఉద్యోగులకు మరింత అనుకూలమవుతుంది. రహదారిపై వాహన సంచార రద్దీ (ట్రాఫిక్) నియంత్రణలోకి ఇదెంతో ఉపకరిస్తుందని పోలీసు అధికారులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికల శక్తి యుక్తులకు పరీక్ష
[ 07-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్య జాతీయ, రాష్ట్ర నేతల హడావుడి మంగళవారంతో పరిసమాప్తం కానుంది. -
మహిళలకు సిద్ధు లేఖ
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియకు కొద్ది గంటలే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మహిళలకు బహిరంగ లేఖ రాశారు. -
ప్రజ్వల్ కేసులో కుట్ర కోణం?
[ 07-05-2024]
కేఆర్నగర ఎమ్మెల్యే డాక్టర్ రవిశంకర్ చేసిన ఆరోపణలతోనే తమ నాయకుడు హెచ్డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిందని జనతాదళ్ హాసన జిల్లా శాఖ అధ్యక్షుడు లింగేశ్ ఆరోపించారు. -
రాజధానిలో వాన జోరు
[ 07-05-2024]
ఈ వారాంతం వరకు బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, కోలారు,చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
ఓటరన్నకు పండగొచ్చె!
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
[ 07-05-2024]
ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న గోవిందప్ప (38) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో సోమవారం మరణించారు. -
అల్లుడి విజయమే ఖర్గే ఆశయం
[ 07-05-2024]
కలబురగి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. -
గనినాడులో సర్వం సిద్ధం
[ 07-05-2024]
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని కంప్లి, బళ్లారి నగర, గ్రామీణ, సండూరు విధానసభ నియోజకవర్గాల సంబంధించిన పోలింగ్ సిబ్బందికి సోమవారం ఓటింగ్ యంత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. -
బెంగళూరులో తెదేపా ప్రచారం
[ 07-05-2024]
అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి ఉపాధి, వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటున్న వారు ఎన్నికల సమయంలో వెనక్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా నాయకులు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు