కొలంబియా మత్తులో చిత్తు
మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న సిగిల్ వర్ఘీస్, అతనితో సహజీవనం చేస్తున్న విష్ణుప్రియల విచారణను పూర్తి చేశామని జాయింటు పోలీసు కమిషనర్ ఎస్.డి.శరణప్ప తెలిపారు.
స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న సిగిల్ వర్ఘీస్, అతనితో సహజీవనం చేస్తున్న విష్ణుప్రియల విచారణను పూర్తి చేశామని జాయింటు పోలీసు కమిషనర్ ఎస్.డి.శరణప్ప తెలిపారు. ఇటీవల అరెస్టు చేసిన వీరి నుంచి రూ.25 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనపరుచుకున్నారు. వీరి వద్ద.. కొలంబియా నుంచి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న నిందితుడి చిత్రాన్ని, వివరాలను సంపాదించామని చెప్పారు. కొలంబియాలో అధోలోకపు నేరగాడు పబ్లో ఎస్కోబార్ను వీరిద్దరూ ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. పచ్చబొట్లు వేస్తూ తిరిగే వీరు.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి డ్రగ్స్ ఓ పథకం ప్రకారం చేరవేసేవారు. తమకు ఇష్టం వచ్చిన బస్టాప్, చెట్లు, పాదచారి మార్గాలు, చెత్త కుండీల సమీపంలో మాదక ద్రవ్యాన్ని ఉంచి, వాటి ఫొటోను వినియోగదారులకు పంపించేవారు. చందాపురలో సహజీవనం చేస్తున్న వీరి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా విదేశాలలో తలదాచుకున్న పలువురు డ్రగ్ డీలర్ల వివరాలను గుర్తించేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. ఆయా ప్రాంతాల దర్యాప్తు సంస్థల సహకారంతో మాదక ద్రవ్యాల తరలింపును అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు నెలల్లో 27 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.15 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనపరుచుకున్నామని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఆ నిందితులు అందరూ 20-25 ఏళ్ల వయసు వారని, కొందరు టెకీలు కాగా మరికొందరు ప్రైవేటు కంపెనీ ఉద్యోగులని తెలిపారు. అదనపు సంపాదన కోసం వీరు అడ్డదారి పట్టారని వివరించారు.
సిగిల్ వర్ఘీస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికల శక్తి యుక్తులకు పరీక్ష
[ 07-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్య జాతీయ, రాష్ట్ర నేతల హడావుడి మంగళవారంతో పరిసమాప్తం కానుంది. -
మహిళలకు సిద్ధు లేఖ
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియకు కొద్ది గంటలే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మహిళలకు బహిరంగ లేఖ రాశారు. -
ప్రజ్వల్ కేసులో కుట్ర కోణం?
[ 07-05-2024]
కేఆర్నగర ఎమ్మెల్యే డాక్టర్ రవిశంకర్ చేసిన ఆరోపణలతోనే తమ నాయకుడు హెచ్డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిందని జనతాదళ్ హాసన జిల్లా శాఖ అధ్యక్షుడు లింగేశ్ ఆరోపించారు. -
రాజధానిలో వాన జోరు
[ 07-05-2024]
ఈ వారాంతం వరకు బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, కోలారు,చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
ఓటరన్నకు పండగొచ్చె!
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
[ 07-05-2024]
ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న గోవిందప్ప (38) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో సోమవారం మరణించారు. -
అల్లుడి విజయమే ఖర్గే ఆశయం
[ 07-05-2024]
కలబురగి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. -
గనినాడులో సర్వం సిద్ధం
[ 07-05-2024]
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని కంప్లి, బళ్లారి నగర, గ్రామీణ, సండూరు విధానసభ నియోజకవర్గాల సంబంధించిన పోలింగ్ సిబ్బందికి సోమవారం ఓటింగ్ యంత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. -
బెంగళూరులో తెదేపా ప్రచారం
[ 07-05-2024]
అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి ఉపాధి, వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటున్న వారు ఎన్నికల సమయంలో వెనక్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా నాయకులు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తివంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు