ప్రబంధ పోటీల్లో లక్ష్మీ మానస సత్తా
సింధనూరు యువతి లక్ష్మీ మానస ప్రబంధ పోటీలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం పొంది అబ్బుర పరిచింది. ఆమెను రాయచూరు విశ్వవిద్యాలయం గురువారం నిర్వహించిన సదస్సుకు ఆహ్వానించి విద్యార్థిని సత్కరించింది.
రాయచూరు విశ్వవిద్యాలయం సన్మానం స్వీకరిస్తున్న లక్ష్మీ మానస
సింధనూరు, న్యూస్టుడే: సింధనూరు యువతి లక్ష్మీ మానస ప్రబంధ పోటీలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం పొంది అబ్బుర పరిచింది. ఆమెను రాయచూరు విశ్వవిద్యాలయం గురువారం నిర్వహించిన సదస్సుకు ఆహ్వానించి విద్యార్థిని సత్కరించింది. రిజిస్ట్రార్, తదితరులు ఆమెను సన్మానించి మైసూరు విశ్వవిద్యాలయం నుంచి లభించిన జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. లక్ష్మీ మానస స్థానిక ఆక్స్ఫర్డ్ కళాశాలలో బీఏ అంతిమ ఏడాది చదువుతోంది. మైసూరు విశ్వవిద్యాలయం ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర అంతర్ విశ్వవిద్యాలయాల రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించింది. కిందటేడాది ఆగస్టు 10న పోటీలు జరగ్గా లక్ష్మీ మానస ప్రథమస్థానం పొందిన విషయాన్ని ప్రకటించి అభినందన పత్రం మాత్రం పంపింది. జ్ఞాపిక, ప్రమాణపత్రం, తదితరాలను రాయచూరు విశవిద్యాలయానికి అందజేసింది. రాయచూరు విశ్వవిద్యాలయం తరఫున పాల్గొని ప్రథమ స్థానం దక్కించుకుని రాష్ట్రస్థాయిలో కీర్తిని చాటిన ఆమెను యాజమాన్యం ప్రశంసించింది. మైసూరులో కాకుండా మా జిల్లాలో రిజిస్ట్రార్ చేతుల మీదుగా ఈ పత్రాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని విజేత లక్ష్మీ మానస పేర్కొన్నారు.
మైసూరు విశ్వవిద్యాలయం అందించిన జ్ఞాపిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM