మరచిపోలేని సుమధురవాణి
భావెంబ హూవు అరళి.. గానవెంబ గంధచల్లి..’ అనే పాటతో కన్నడ ప్రజల హృదయాలలో తన సంగీత సుమధుర భావ సుగంధాలను వెదజల్లిన ప్రముఖ నేపథ్య గాయని వాణీజయరాం గొంతు మూగబోయిందన్న చేదు వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు.
అపూర్వ గాయని.. వాణీ జయరాం
బెంగళూరు సాంస్కృతికం: ‘భావెంబ హూవు అరళి.. గానవెంబ గంధచల్లి..’ అనే పాటతో కన్నడ ప్రజల హృదయాలలో తన సంగీత సుమధుర భావ సుగంధాలను వెదజల్లిన ప్రముఖ నేపథ్య గాయని వాణీజయరాం గొంతు మూగబోయిందన్న చేదు వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె శనివారం చెన్నైలో కన్ను మూశారన్న సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. కన్నడ సినీ నేపథ్యరంగంలో ప్రవేశించిన ఆమె ఐదుదశాబ్దాలు అభిమానులను అలరించారు. ఆమె పాటల జాబితా పుస్తకం తెరిస్తే.. అన్నీ హిట్ కొట్టినవే. కన్నడనాడుకు చేరువలోని వెల్లూరులో జన్మించిన ఆమె కర్నాటిక్, హిందుస్తానీ సంగీతాలను నేర్చుకున్నారు. సంగీతంలోని అన్ని ప్రక్రియలకూ సినీ స్పర్శనిచ్చి వాటి వైశిష్ట్యాన్ని ఉన్నతీకరించారు. 1973లో కన్నడ సినీ రంగంలో ప్రవేశించారు. ఇప్పటికే ఆరువందలకు పైగా పాటలు పాడారు. ‘కెసరిన కమల..’ ఈమె మొదటి పాట. ఇదేరాగదల్లి.. ఇదే తాళదల్లి.. (శ్రావణబంతు), కనసలూ నీనె.. మనసలూ నీనె( బయలుదారి), నిన్నెగింత ఇందుచెంద (అపూర్వ సంగమ), ఆడువ మురళి (ఆనందభైరవి), ఓ ప్రియతమా (కవిరత్న కాళిదాస) పాటలతో విఖ్యాతినొందారు. రణరంగ, ప్రేమలోక, యుగపురుష తదితర సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు. ‘మళెనాడిన మూలెయాగి ఇత్తోందు సణ్ణ హళ్లి’ అనే జానపద స్పర్శగల పాట కన్నడ మహిళల నోట బాగా వినవస్తుంది. తిరువనంతపురంలో మూడుగంటలపాటు ధాటిగా సుదీర్ఘ సంగీత కచేరీ చేసినపుడు ఆమె వయసు కేవలం పది సంవత్సరాలు. గానంతోపాటు చిత్రరచనలోనూ ప్రతిభ అద్భుతం. అర్ధశాస్త్రంలో స్నాతకోత్తర విద్య పూరి చేసిన ఆమెకు లభించిన అవార్డులు, రివార్డులు, బిరుదులు అనేకానేకం. 1971లో సినీ అరంగేట్రం చేసిన వాణి.. కన్నడనాడుకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. అనేక ప్రైవేటు, భక్తి, జానపద, లలిత సంగీత పాటలు పాడారు. సీని వినీలాకాశం ఓ సంగీత సితార నేడు నేలకు ఒరిగిపోవటమే అభిమానులను వేదనకు గురిచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం