మీనం సాగు.. రాబడి బహుబాగు
కొవిడ్ ప్రభావంతో నగర, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు చేరుకున్న యువతీ, యువకులు చేపలు, కోళ్లు పెంపకం, పాడి ఉత్పత్తి, పండ్ల తోటల సాగుపై దృష్టి సారించి అద్భుతాలు సాధిస్తున్నారు.
ఉద్యోగం వదిలి సేద్యంవైపు అడుగులు
రాణిస్తున్న సాప్ట్వేర్ ఇంజినీరు
తండ్రి బుజ్జిరాజుతో కలిసి చేపలు పడుతున్న రఘురామరాజు
బళ్లారి, న్యూస్టుడే: కొవిడ్ ప్రభావంతో నగర, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు చేరుకున్న యువతీ, యువకులు చేపలు, కోళ్లు పెంపకం, పాడి ఉత్పత్తి, పండ్ల తోటల సాగుపై దృష్టి సారించి అద్భుతాలు సాధిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కురుగోడు తాలూకా క్యాదిగాళు గ్రామానికి చెందిన బుజ్జిరాజు(సత్యనారాయణరాజు) కుమారుడు రఘురామరాజు డిప్లొమా, కోడలు బిందు మాధవి కూడా ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశారు. కొవిడ్ ప్రభావంతో సొంత గ్రామం క్యాదిగాళు చేరుకుని 35 ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగు చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా రామాయణపురం గ్రామానికి చెందిన బుజ్జిరాజు బళ్లారి సమీపంలోని కప్పగల్లు గ్రామంలో స్థిరపడి పండ్ల తోటలు సాగు చేసేవారు. అనుకున్న స్థాయిలో దిగుబడి రాకపోవడంతో కురుగోడు తాలూకాలోని క్యాదిగాళు గ్రామం సమీపంలో వ్యవసాయానికి పనికిరాని చౌడు భూమిని కొనుగోలు చేసి చేపల పెంపకం ప్రారంభించారు. బుజ్జిరాజు ఒక్కరే పొలం వద్దే ఇంటిని నిర్మించుకుని మొదట 12 ఎకరాల్లో మత్స్యసాగు చేపట్టారు. కొవిడ్ ప్రభావంతో కుమారుడు రఘురామరాజు ఉద్యోగం వదిలి సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఆయన భార్య బిందుమాధవి కూడా సొంత ఊరికి చేరుకున్నారు. రఘురామరాజు ఉద్యోగం వదిలి 12 ఎకరాల నుంచి 35 ఎకరాలకు విస్తరించి చేపల పెంపకం చేపట్టాడు. మిగిలిన చెరువులో రొయ్యలు సాగు చేస్తున్నాడు.
చేపలను చూపుతున్న రైతు బుజ్జిరాజు, మత్య్సుశాఖాధికారి శివప్ప
దిగుబడి ఘనం
ఉద్యోగం వదిలివచ్చిన రఘురామరాజు తండ్రికి పనిభారం తగ్గించాడు. మొత్తం సాగును అతనే చూసుకుంటున్నాడు. ప్రస్తుతం 12 ఎకరాల్లో రూపచంద్ అనే రకం చేపలు పెంచుతున్నాడు. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల దిగుబడి సాధిస్తూ ఖర్చులుపోను ఎకరాకు రూ.లక్షకుపైగా ఆదాయం పొందుతున్నాడు. రొయ్యలను 23 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరాకు 2 నుంచి 4 టన్నుల వరకు ఉత్పత్తి సాధిస్తున్నారు. మూడు నుంచి నాలుగు నెలల్లోపు దిగుబడి వస్తుండటంతో ఏడాదికి రెండుసార్లు పెంచుతున్నారు. రొయ్యల సాగుకు ఎకరాపై రూ.3 లక్షల నుంచి రూ.4లక్షలు ఖర్చులుపోను ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు రాబడి పొందుతున్నాడు. 35 ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగు కూలీలు లేకుండా సొంతంగా చేసుకుంటున్నారు. పొలంలోనే ఇంటిని నిర్మించుకుని 24 గంటల పాటు సేద్యంపైనే దృష్టి సారించడంతో మంచి దిగుబడితో పాటు మార్కెట్పై మంచి అవగాహన పెంచుకుని లాభాలు గడిస్తున్నాడు.
చౌడు భూమిలో జలసంపద
2003లో వ్యవసాయానికి పనికి రాని చౌడు భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేశాం. మత్య్సుశాఖాధికారి శివప్ప సహకరించడంతో ప్రభుత్వం నుంచి వివిధ పథకాలు కింద నిధులు విడుదల చేశారు. 25 ఎకరాల సొంత భూమి, సమీపంలోని మరో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రొయ్యలు, చేపలు సాగు చేస్తున్నాం. కూలీలపై ఆధారపడకుండా ఇంటివారే చేయడంతో ఖర్చులు తగ్గడంతో పాటు ప్రణాళికాబద్ధంగా చేయడంతో మంచి దిగుబడి సాధిస్తున్నాం. దాణా వేయడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మందులు వాడకం, కృత్రిమంగా గాలిమరల నుంచి గాలిని అందించడం, రాత్రి పూట కాపలా ఉంటున్నాం. చేపలు, రొయ్యలను పట్టడానికి కూలీలను ఉపయోగిస్తున్నాం. పెట్టుబడి పోను ఏటా ఎకరాపై రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నాం. ఉద్యోగంలో ఒత్తిడి ఉండేది. ఇంటి వద్ద ఉంటూ పనిచేయడం సంతోషంగా ఉంది.
రఘురామరాజు, యువ రైతు
పుచ్చకాయల పండుగ!
ఓ వీధులో పుచ్చకాయలు పేర్చుతున్న వ్యాపారి
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : మునుపెన్నడూ లేనంతగా ఈసారి పుచ్చకాయల పంట విరగకాసినట్లే! బెంగళూరు గ్రామీణ, చిక్కబళ్లాపుర, రామనగర, కోలారు, తుమకూరు జిల్లాల్లో పంట అప్పుడే కోతకు రావడంతో బెంగళూరు నగరానికి రైతులు సరకు తరలించడం ప్రారంభించారు. ఈసారి చీడ, పీడల సమస్య ఎదురుకాలేదని, మేలురకం సరకు అందుబాటులోకి వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నా- ప్రస్తుత చలి వాతావరణంలో వ్యాపారం మాత్రం మందకొడిగా సాగుతోంది. బెంగళూరు కేఆర్ మార్కెట్, మల్లేశ్వరం, గాంధీబజార్ విపణులలో పుచ్చకాయల రాసులు దర్శనమిస్తున్నాయి. కిలో రూ.80 నుంచి రూ.100 వరకు గరిష్ఠ ధర పలుకుతోంది. పండ్ల రసాలను తయారు చేసే దుకాణాలలోనూ వీటికి ఒకింత డిమాండు క్రమంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వేసవి తాపం పెరిగే కొద్దీ గిట్టుధరలు బాగా పెరగుతాయని వ్యాపారులు, రైతులు ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా బాలల సంబరమే
[ 10-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ ఆరు వరకు 2,750 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 73.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలికలు ఎక్కువ మంది ముందడుగు వేశారు. -
కారాగారంలో కునుకే కరవాయె
[ 10-05-2024]
కిడ్నాప్ కేసులో అరెస్టై.. పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్లో ఉన్న మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణకు 4567 నంబరును కేటాయించారు. -
మూలకణ మార్పిడిలో అద్భుతం
[ 10-05-2024]
భారతదేశం- జర్మనీ దేశాల వాతావరణం, రెండు దేశాల ప్రజల జన్యు నిర్మాణాలకు అంతులేని వ్యత్యాసం ఉంటుంది. సృష్టిలో మానవులంతా ఒక్కటే అంటూ నిరూపించింది ఓ మూలకణ మార్పిడి సంఘటన. -
తల్లీ, కుమారుడి సాధన
[ 10-05-2024]
ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన జ్యోతి (38), ఆమె కుమారుడు సీబీ నితిన్ ఇద్దరూ ఉత్తీర్ణత సాధించారు. నితిన్ ఏ+ గ్రేడుతో 582 మార్కులు దక్కించుకోగా, అతని తల్లి టీఆర్ జ్యోతి 250 మార్కులతో సీ గ్రేడులో ఉత్తీర్ణులయ్యారు. -
డెంగీ లక్షణాలతో బాలుడి మృతి
[ 10-05-2024]
డెంగీ లక్షణాలతో మృతి చెందిన బాలుడు మృతదేహాన్ని బుధవారం రాత్రి ఆసుపత్రి వద్ద పెట్టి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం తెలిసిందే. -
టేకూరు కృష్ణమూర్తి పేరిట తపాలా కవర్
[ 10-05-2024]
భారతీయ రెడ్క్రాస్ సంస్థ, తపాలా శాఖ, మేధా డిగ్రీ కళాశాల, విమ్స్ ఆసుపత్రి, స్పందన చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా గురువారం శ్రీ మేధా డిగ్రీ కళాశాల సభాభవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా -
ముంపు గాయానికి మందు
[ 10-05-2024]
రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో లోతట్టు ప్రదేశాలను ముంపు నుంచి సంరక్షించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె చేపట్టే పథకాలకు ప్రపంచ బ్యాంకు రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేయడానికి ముందుకొచ్చింది. -
సిట్ నిరుపయోగం: కుమార
[ 10-05-2024]
అశ్లీల వీడియోల పెన్డ్రైవ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) ఒక్క అడుగూ ముందుకు వేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆక్రోశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!