పొరుగు సాక్ష్యం సరిపోదు
తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడంటూ ఓ వ్యక్తిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై ఇరుగు పొరుగువారు చెప్పిన మాటల ఆధారంగా శిక్షను విధించడం సరికాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
శివాజీనగర, న్యూస్టుడే : తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడంటూ ఓ వ్యక్తిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై ఇరుగు పొరుగువారు చెప్పిన మాటల ఆధారంగా శిక్షను విధించడం సరికాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రవర్తనను ఇరుగు పొరుగులు ఎలా నిర్ణయిస్తారని జస్టిస్ హెచ్బీ ప్రభాకరశాస్త్రి, జస్టిస్ సీఎం జోషిల నేతృత్వంలోని పీఠం ప్రశ్నించింది. ఇరుగు పొరుగు వాంగ్మూలం ఆధారంగా నిందితునికి జీవిత ఖైదు శిక్షను విధిస్తూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. మరోసారి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. బాగలకోట హున్డేకర్ గల్లీలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఒక గృహిణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు, ఆమె భర్తే అతన్ని హత్య చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇరుగు పొరుగులు ఇచ్చిన వాంగ్మూలంతోనే కేసు నమోదు చేశారని, దిగువ న్యాయస్థానం జీవిత ఖైదును విధించిందంటూ బాధితుడు వేసుకున్న అర్జీపై విచారణ పూర్తి చేసి న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా బాలల సంబరమే
[ 10-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ ఆరు వరకు 2,750 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 73.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలికలు ఎక్కువ మంది ముందడుగు వేశారు. -
కారాగారంలో కునుకే కరవాయె
[ 10-05-2024]
కిడ్నాప్ కేసులో అరెస్టై.. పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్లో ఉన్న మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణకు 4567 నంబరును కేటాయించారు. -
మూలకణ మార్పిడిలో అద్భుతం
[ 10-05-2024]
భారతదేశం- జర్మనీ దేశాల వాతావరణం, రెండు దేశాల ప్రజల జన్యు నిర్మాణాలకు అంతులేని వ్యత్యాసం ఉంటుంది. సృష్టిలో మానవులంతా ఒక్కటే అంటూ నిరూపించింది ఓ మూలకణ మార్పిడి సంఘటన. -
తల్లీ, కుమారుడి సాధన
[ 10-05-2024]
ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన జ్యోతి (38), ఆమె కుమారుడు సీబీ నితిన్ ఇద్దరూ ఉత్తీర్ణత సాధించారు. నితిన్ ఏ+ గ్రేడుతో 582 మార్కులు దక్కించుకోగా, అతని తల్లి టీఆర్ జ్యోతి 250 మార్కులతో సీ గ్రేడులో ఉత్తీర్ణులయ్యారు. -
డెంగీ లక్షణాలతో బాలుడి మృతి
[ 10-05-2024]
డెంగీ లక్షణాలతో మృతి చెందిన బాలుడు మృతదేహాన్ని బుధవారం రాత్రి ఆసుపత్రి వద్ద పెట్టి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం తెలిసిందే. -
టేకూరు కృష్ణమూర్తి పేరిట తపాలా కవర్
[ 10-05-2024]
భారతీయ రెడ్క్రాస్ సంస్థ, తపాలా శాఖ, మేధా డిగ్రీ కళాశాల, విమ్స్ ఆసుపత్రి, స్పందన చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా గురువారం శ్రీ మేధా డిగ్రీ కళాశాల సభాభవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా -
ముంపు గాయానికి మందు
[ 10-05-2024]
రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో లోతట్టు ప్రదేశాలను ముంపు నుంచి సంరక్షించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె చేపట్టే పథకాలకు ప్రపంచ బ్యాంకు రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేయడానికి ముందుకొచ్చింది. -
సిట్ నిరుపయోగం: కుమార
[ 10-05-2024]
అశ్లీల వీడియోల పెన్డ్రైవ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) ఒక్క అడుగూ ముందుకు వేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆక్రోశించారు.