logo

జాతకం చెబుతానంటూ..కడతేరిపోయాడు

బార్‌లో కూర్చుని భవిష్యత్తు చెబుతానంటూ ఉత్సాహం చూపిన నరేశ్‌ (25) అనే యువకుడు చివరికి కడతేరిపోయాడు.

Published : 26 Mar 2023 03:35 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : బార్‌లో కూర్చుని భవిష్యత్తు చెబుతానంటూ ఉత్సాహం చూపిన నరేశ్‌ (25) అనే యువకుడు చివరికి కడతేరిపోయాడు. ఈ కేసులో మారిముత్తు అనే యువకుడిని బెంగళూరు గోవిందరాజనగర పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆ ఇద్దరూ మంచి స్నేహితులు. నాగరబావిలోని ఒక బార్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మద్యం తాగుతూ గడిపారు. మత్తు తలకెక్కిన వేళ.. నీ జాతకాన్ని చెబుతానంటూ నరేశ్‌ ఉబలాటపడ్డాడు. అతని చేయి పట్టుకున్నాడు. ‘నీకు చెడు అలవాట్లు దండిగా ఉన్నాయి. అమ్మాయిల పిచ్చి ఎక్కువ. ఇంకొన్ని సంవత్సరాలలో నువ్వు చనిపోతావు’ అని చెప్పిన అతనితో మారిముత్తులో గొడవకు దిగాడు. బార్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత నరేశ్‌పై దాడి చేసి, కింద పడిన అతని తలపై బండరాయి వేసి హత్య చేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. హతుని భార్య మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుని వివరాలను త్వరగా గుర్తించి గోవిందరాజనగర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని