త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లు
త్వరలో బెంగళూరు- ముంబయి, బెంగళూరు-హైదరాబాద్ మధ్య వందే భారత్ రైళ్లు వస్తాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి వి.సోమణ్ణ వెల్లడించారు.
తన సాధనల పుస్తకాన్ని ప్రదర్శిస్తున్న సోమణ్ణ
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే: త్వరలో బెంగళూరు- ముంబయి, బెంగళూరు-హైదరాబాద్ మధ్య వందే భారత్ రైళ్లు వస్తాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి వి.సోమణ్ణ వెల్లడించారు. మైసూరు- బెంగళూరు- చెన్నై మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్ రైలుకు చక్కని స్పందన లభించిందని చెప్పారు. విధానసౌధలో బుధవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబయి, హైదరాబాద్లకు రైలు సేవలను ప్రారంభించాలని రైల్వే మంత్రి, రైల్వే శాఖ కార్యదర్శికి తాము రాసిన లేఖకు సకారాత్మకంగా స్పందించారని తెలిపారు. ధర్మస్థలలో మినీ విమానాశ్రయం నిర్మాణానికి అనుబంధంగా పలు పనులను ఇప్పటికే ప్రభుత్వ ప్రారంభించిందని చెప్పారు. ధర్మస్థలకు ఎనిమిది కి.మీ.ల దూరంలో ఈ విమానాశ్రయం వస్తుందన్నారు. బిజాపుర, హాసనలలో విమానాశ్రయం పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. గత నెల ప్రారంభించిన శివమొగ్గ విమానాశ్రయం నుంచి విమానాలను నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకు వచ్చిందన్నారు. వచ్చే రెండు నెలలలో తమ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించిందన్నారు. బొమ్మై నాయకత్వంలోనే తాము ఎన్నికలను వెళ్తున్నామని చెప్పారు. భాజపాను తాను విడిచిపెట్టనని పునరుద్ఘాటించారు. తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేసిన సేవలు, చేసిన అభివృద్ధి పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.