అలిగిన ఆశావహులు
ప్రతిష్ఠాత్మకమైన విజయనగర నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడు పార్టీలు తమ అభ్యర్థులను వెల్లడించాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గవియప్ప....
విజయనగర కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్నికలు సవాలే
నియోజకవర్గంలో ఒంటరిగా ప్రచారం చేస్తున్న విజయనగర కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.ఆర్.గవియప్ప
హొసపేటె, న్యూస్టుడే: ప్రతిష్ఠాత్మకమైన విజయనగర నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడు పార్టీలు తమ అభ్యర్థులను వెల్లడించాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గవియప్ప, ఆమ్ ఆద్మీ నుంచి డి.శంకర్ దాస్, కర్ణాటక రాష్ట్ర సమితి నుంచి కణదాళు మంజునాథ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఇప్పటివరకు భాజపా, జేడీఎస్, సీపీఎం అభ్యర్థులను ప్రకటించలేదు. 2008లో నియోజకవర్గం పునర్విభజన తరువాత, జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికలు, ఓ ఉప ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, భాజపా నడుమ ప్రత్యక్ష పోరు జరిగింది. ఈ సారి కూడా రెండు ప్రముఖ పార్టీల అభ్యర్థుల నడుమ పోరు గట్టిగా ఉంటుంది. విజయనగర నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్టు కోసం సుమారు 12మంది దరఖాస్తు వేశారు. అందులో మాజీ ఎమ్మెల్యే గవియప్పకు పార్టీ టికెట్ కట్టబెట్టింది. మిగిలినవారు మరుసటి రోజునుంచే అలిగి ఇళ్లకు పరిమితమయ్యారు. సండూరు రాజవంశీకుడు వెంకట్రావు ఘోర్పడే, కొప్పళ నాయకుడు రాజశేఖర్ హిట్నాళు, సండూరు మాజీ ఎమ్మెల్యే సిరాజ్ షేక్, హొసపేటె మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇమాం నియాజిలు టికెట్ ఆశావహుల్లో ప్రముఖులు. టికెట్టు వెల్లడించిన రోజు గవియప్ప మాధ్యమాలతో మాట్లాడుతూ..టికెట్ దొరక్క నిరాశచెందినవారిని కూడా కలుపుకొని ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వారెవరిని అభ్యర్థి గవియప్ప పలకరించలేదని తెలిసింది. తన ఇద్దరు కుమారులు చెరో వైపు, తను ఓ వైపు ఒంటరిగానే అభ్యర్థి గవియప్ప ప్రచారాన్ని ప్రారంభించారు. 2004లో హొసపేటె నియోజకవర్గంలో స్వతంత్రుడిగా గెలిచిన గవియప్ప, తరువాత కాంగ్రెస్లో చేరి 2008లో విజయనగర నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. అప్పుడు భాజపా నుంచి ఆనంద్సింగ్, స్వతంత్రుడిగా దీపక్సింగ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి దీపక్సింగ్ ఓట్లను చీల్చడంతో భాజపా అభ్యర్థి ఆనంద్సింగ్ విజయం సాధించారు. 2013లో గవియప్ప మరోసారి కాంగ్రెస్ టికెట్కోసం ప్రయత్నించినా, అది మైనార్టీ నాయకుడు అబ్దుల్ వహాబ్కు దక్కింది. ఆయన కూడా భాజపా అభ్యర్థి ఆనంద్సింగ్ చేతిలో ఓడిపోయారు. 2018లో అనుకోకుండా ఆనంద్సింగ్ కాంగ్రెస్లో చేరి టికెట్టుతో విజయనగర బరిలో దిగారు. గవియప్ప కూడా అనుకోకుండా భాజపాలో చేరి ఆనంద్సింగ్ను ఎదుర్కొని మరోసారి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు గవియప్పకు మరోసారి కాంగ్రెస్ టికెట్ దక్కింది. ఆయన దారి అంత సులభంగా లేదు. నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్లో చీలికలు ఏర్పడ్డాయి. వారందరినీ సమన్వయం చేసుకుని పోయే పెద్ద బాధ్యత అభ్యర్థి గవియప్పపైన ఉంది. ఇప్పటివరకు ఆయన తమను సంప్రదించనేలేదని టికెట్కోసం ప్రయత్నించిన రాజవంశీకుడు వెంకట్రావు ఘోర్పడే, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇమాం నియాజిలు స్పష్టం చేశారు. ఆయన ఆసక్తి చూపి ఆహ్వానిస్తే తప్పకుండా ఆయన తరఫున ప్రచారంలో పాల్గొంటామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికల శక్తి యుక్తులకు పరీక్ష
[ 07-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్య జాతీయ, రాష్ట్ర నేతల హడావుడి మంగళవారంతో పరిసమాప్తం కానుంది. -
మహిళలకు సిద్ధు లేఖ
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియకు కొద్ది గంటలే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మహిళలకు బహిరంగ లేఖ రాశారు. -
ప్రజ్వల్ కేసులో కుట్ర కోణం?
[ 07-05-2024]
కేఆర్నగర ఎమ్మెల్యే డాక్టర్ రవిశంకర్ చేసిన ఆరోపణలతోనే తమ నాయకుడు హెచ్డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిందని జనతాదళ్ హాసన జిల్లా శాఖ అధ్యక్షుడు లింగేశ్ ఆరోపించారు. -
రాజధానిలో వాన జోరు
[ 07-05-2024]
ఈ వారాంతం వరకు బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, కోలారు,చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
ఓటరన్నకు పండగొచ్చె!
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
[ 07-05-2024]
ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న గోవిందప్ప (38) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో సోమవారం మరణించారు. -
అల్లుడి విజయమే ఖర్గే ఆశయం
[ 07-05-2024]
కలబురగి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. -
గనినాడులో సర్వం సిద్ధం
[ 07-05-2024]
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని కంప్లి, బళ్లారి నగర, గ్రామీణ, సండూరు విధానసభ నియోజకవర్గాల సంబంధించిన పోలింగ్ సిబ్బందికి సోమవారం ఓటింగ్ యంత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. -
బెంగళూరులో తెదేపా ప్రచారం
[ 07-05-2024]
అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి ఉపాధి, వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటున్న వారు ఎన్నికల సమయంలో వెనక్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా నాయకులు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు