logo

Karnataka Election: కాంగ్రెస్‌ అభ్యర్థే గెలుస్తారంటూ రెండెకరాల పందెం

హొన్నాళిలో కాంగ్రెస్‌ అభ్యర్థి శాంతనగౌడ గెలుస్తారని- భాజపా ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్యదే విజయమంటూ పందేలు జోరుగా కొనసాగుతున్నాయి.

Updated : 13 May 2023 07:21 IST

చాటింపు వేయిస్తున్న దృశ్యం

దావణగెరె, న్యూస్‌టుడే : హొన్నాళిలో కాంగ్రెస్‌ అభ్యర్థి శాంతనగౌడ గెలుస్తారని- భాజపా ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్యదే విజయమంటూ పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. శాంతనగౌడ గెలుస్తారని నాగణ్ణ అనే వ్యక్తి తన రెండెకరాల పొలాన్ని పందేనికి ఉంచారు. ఎవరైనా పందెం కాసేవారు ఉంటే.. రావాలంటూ గ్రామంలో గురువారం రాత్రి చాటింపు వేయించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

జోరుగా బెట్టింగ్‌

చామరాజనగర, న్యూస్‌టుడే : కొండసీమల చామరాజనగర జిల్లాలో అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగ్‌ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో సోమణ్ణ విజయంపై రూ.కోటి వరకు పందేలు కాసుకున్న వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. గుండ్లుపేట తాలూకా మల్లయ్యనపుర గ్రామానికి చెందిన కిరణ్‌ అనే వ్యక్తి తన చేతిలో రూ.3 లక్షలు పట్టుకుని కాంగ్రెస్‌ గెలుస్తుందంటూ పందెం కాశారు. వీడియో ఆధారంగా పోలీసులు అతని నివాసంపై దాడి చేసి, విచారణ చేపట్టారు. మరో వీడియోలో తాను చెబుతున్న అభ్యర్థులు గెలుస్తారని, ఎవరైనా రూ.కోటి పందెం కాయవచ్చంటూ ఒక వ్యక్తి సవాలు విసిరాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని