వారంలో విపక్ష నేత ఎంపిక
వచ్చే వారం విధానసభ విపక్ష నాయకుడిని ఎంపిక చేసుకుంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్ తెలిపారు.
నళిన్కుమార్ కటీల్
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : వచ్చే వారం విధానసభ విపక్ష నాయకుడిని ఎంపిక చేసుకుంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు తమ ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించడం సాధ్యం కాలేదని, దానికి కూడా భాజపానే కారణమని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. భాజపా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఒక వారం పాటు సంచరిస్తూ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి జరుగుతున్న వివాదాలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ 200 యూనిట్ల విద్యుత్తు బిల్లు ఉచితం అని చెప్పడంతో ప్రజలు తాము బిల్లు చెల్లించమంటూ ఎదురు తిరుగుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చే వరకు బిల్లు చెల్లించవద్దని సిద్ధరామయ్య కూడా పలుసార్లు బహిరంగ వేదికపైనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఏ బాధ్యతలైనా ఓకే
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : కాంగ్రెస్ పార్టీ లింగాయత నాయకులకు ఏ బాధ్యతలు అప్పగిస్తుందో వేచి చూస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. భాజపా లింగాయతలను అవమానించిందంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను గుర్తు చేశారు. బుధవారం ఇక్కడ తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడుతూ ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారాన్ని అప్పగించారని, త్వరగా ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకుని, అభివృద్ధి పనులకు పెద్ద పీట వేయాలని హితవు పలికారు. పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఎంపిక కష్టం కావడం, ఆ పార్టీలో నేతల మధ్య అవగాహన లేదన్న విషయాన్ని సూచిస్తుందని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సామాజిక సమర భూమిక
[ 30-04-2024]
మలివిడత ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలంతా మాటల తూటాలు పేలుస్తున్నారు. -
భాజపాను గెలిపిస్తే పెనుముప్పు
[ 30-04-2024]
‘భాజపా ఈసారి 400సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పార్టీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోల్పోయినట్లే’నని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను హెచ్చరించారు. -
ప్రజ్వల్ రాజకీయ భవితపై నీలినీడలు
[ 30-04-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సొంతపార్టీ జనతాదళ్ నేతల నుంచే డిమాండ్లు వెల్లువెత్తడం అనూహ్య పరిణామంగా మారింది. -
సీనియర్ నేత శ్రీనివాసప్రసాద్ కన్నుమూత
[ 30-04-2024]
కేంద్ర మాజీ మంత్రి, ఆరుసార్లు లోక్సభకు, రెండుసార్లు కర్ణాటక విధానసభకు ఎన్నికైన సీనియరు నాయకుడు వి.శ్రీనివాస ప్రసాద్ (76) ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటలకు కన్నుమూశారు. -
ఆసుపత్రిలో చేరిన కృష్ణ
[ 30-04-2024]
మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (91)కు ఆరోగ్య సమస్యలు తిరగబెట్టాయి. -
కల్నల్ జంగ్వీర్కు అభినందనల వెల్లువ
[ 30-04-2024]
ఐరన్ మ్యాన్గా గుర్తింపు దక్కించుకున్న కల్నల్ జంగ్వీర్ లాంబా (53) మొరాకో సహారాలో నిర్వహించిన 38వ వార్షిక మారథాన్లో పతకాన్ని సాధించారు. -
కాంగ్రెస్లో నాయకత్వం ద్విగుణీకృతం
[ 30-04-2024]
కాంగ్రెస్లో నాయకులు, నాయకత్వం లేదంటూ ప్రధాని మోదీ ప్రచారం పచ్చి అబద్ధమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. -
పదేళ్లలో ఏం చేశారని ఓటేయాలి?
[ 30-04-2024]
గడిచిన పదేళ్లలో మహాప్రభు (నరేంద్ర మోదీ) ప్రజలకు ఏమి చేశారని ఓటు వేయాలి. దేశంలో నిరుద్యోగ సమస్య పెంచినందుకా?.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై