దయలేని అమరేంద్ర
సంతానం లేదని కొందరు గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు. మరికొందరు ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకుని సంతాన భాగ్యం కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటారు.
ఇద్దరు బిడ్డలను హత్య చేసిన తండ్రి
దావణగెరె, న్యూస్టుడే : సంతానం లేదని కొందరు గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు. మరికొందరు ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకుని సంతాన భాగ్యం కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటారు. దావణగెరెకు చెందిన అమర్ అలియాస్ అమరేంద్ర (36)కు అద్వైత్, అన్విత్ నిష్కరుణి అనే నాలుగేళ్ల కవల పిల్లలు ఉన్నారు. గోకాక్కు చెందిన అమర్ తన భార్యాబిడ్డలు, తల్లి సావిత్రమ్మతో కలిసి ఆంజనేయ లేఅవుట్లో ఉంటున్నారు. హరిహరలోని కార్గిల్ ఫ్యాక్టరీలో కెమికల్ ఇంజినీరుగా పని చేసేవారు. అమర్తో గొడవ పడి.. అతని భార్య జయలక్ష్మి బిడ్డలను భర్త వద్దే విడిచి పెట్టి విజయపురలోని పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి సావిత్రమ్మ నిద్రపోయిన తర్వాత బుధవారం రాత్రి తన పిల్లలు ఇద్దరినీ కారులోకి ఎక్కించుకుని హావేరి జిల్లా రాణె బెన్నూరు తాలూకా చళగేరి టోల్ గేట్ సమీపంలోని సర్వీసు రోడ్డుకు అమర్ చేరుకున్నాడు. కారులోని బిడ్డల నోరు, ముక్కుకు సెల్లోటేపుతో చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడని పోలీసు అధికారులు గుర్తించారు. మృతదేహాలను రహదారి పక్కనే వదిలి వెళ్లిపోయాడని వివరించారు. మృతదేహాలను గుర్తించి, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో టోల్గేటు సమీపంలోని కెమెరాలను పోలీసులు పరిశీలించారు. వాహనం నంబరు ఆధారంగా అమర్ను గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. తానే ఇద్దరు బిడ్డలను హత్య చేశానని నిందితుడు అంగీకరించడం ప్రస్తావనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికల శక్తి యుక్తులకు పరీక్ష
[ 07-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్య జాతీయ, రాష్ట్ర నేతల హడావుడి మంగళవారంతో పరిసమాప్తం కానుంది. -
మహిళలకు సిద్ధు లేఖ
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియకు కొద్ది గంటలే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మహిళలకు బహిరంగ లేఖ రాశారు. -
ప్రజ్వల్ కేసులో కుట్ర కోణం?
[ 07-05-2024]
కేఆర్నగర ఎమ్మెల్యే డాక్టర్ రవిశంకర్ చేసిన ఆరోపణలతోనే తమ నాయకుడు హెచ్డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిందని జనతాదళ్ హాసన జిల్లా శాఖ అధ్యక్షుడు లింగేశ్ ఆరోపించారు. -
రాజధానిలో వాన జోరు
[ 07-05-2024]
ఈ వారాంతం వరకు బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, కోలారు,చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
ఓటరన్నకు పండగొచ్చె!
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
[ 07-05-2024]
ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న గోవిందప్ప (38) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో సోమవారం మరణించారు. -
అల్లుడి విజయమే ఖర్గే ఆశయం
[ 07-05-2024]
కలబురగి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. -
గనినాడులో సర్వం సిద్ధం
[ 07-05-2024]
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని కంప్లి, బళ్లారి నగర, గ్రామీణ, సండూరు విధానసభ నియోజకవర్గాల సంబంధించిన పోలింగ్ సిబ్బందికి సోమవారం ఓటింగ్ యంత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. -
బెంగళూరులో తెదేపా ప్రచారం
[ 07-05-2024]
అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి ఉపాధి, వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటున్న వారు ఎన్నికల సమయంలో వెనక్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా నాయకులు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్