logo

జనతాదళ్‌తో పొత్తు గట్టిదే : అప్ప

జనతాదళ్‌-భాజపా పొత్తు కొనసాగుతుందని భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్‌ యడియూరప్ప తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తాను ఇప్పటికే 23 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టి వచ్చానని చెప్పారు.

Updated : 17 Apr 2024 06:47 IST

దావణగెరె, న్యూస్‌టుడే : జనతాదళ్‌-భాజపా పొత్తు కొనసాగుతుందని భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్‌ యడియూరప్ప తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తాను ఇప్పటికే 23 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టి వచ్చానని చెప్పారు. దావణగెరెలో గాయత్రి సిద్ధేశ్వర్‌ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం భద్ర పథకానికి ఇప్పటికే ప్రకటించిన నిధులు విడుదల చేస్తుందని అప్ప భరోసా ఇచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ విమర్శలు పట్టించుకోరాదన్నారు. అంబేడ్కర్‌ జీవించి ఉన్నప్పుడు ఆయనను అవమానించిన కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు ఆయనను తమ ఆస్తిగా భావిస్తున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని