గిరిజనుల విద్యాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైన గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, గిరిజనుల విద్యాభివృద్ధి, వికాసమే
మంత్రి సత్యవతి
రఘునాథపాలెంలో స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి
శంకుస్థాపన చేస్తున్న మంత్రులు సత్యవతి, అజయ్కుమార్, ఎంపీ నామా, కలెక్టర్, పీవో తదితరులు
రఘునాథపాలెం, న్యూస్టుడే: గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైన గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, గిరిజనుల విద్యాభివృద్ధి, వికాసమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండల కేంద్రం రఘునాథపాలెంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజులతో కలిసి మంగళవారం మంత్రి సత్యవతి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి అజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోనే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రయివేటు కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా వీటిలో చదివిన విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధిస్తున్నారన్నారు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లోనూ సీట్లు పొందేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఇందుకోసం 6ఎకరాల విస్తీర్ణంలో రూ.20కోట్లతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. ప్రధాన రహదారి చెంత విలువైన స్థలాన్ని పాఠశాల భవన నిర్మాణానికి కేటాయించేందుకు కృషి చేసిన మంత్రి అజయ్కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలో రూ.1.10కోట్లతో చేపట్టిన గిరిజన భవనం ప్రారంభించుకున్నామని, రఘునాథపాలెంలో రూ.20కోట్లతో పాఠశాల, రేలకాయలపల్లిలో రూ.21.01కోట్లతో ఏకలవ్య పాఠశాల మొత్తంగా రూ.42కోట్లతో గిరిజన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గతంలో రాష్ట్రంలో 273 గురుకులాలు ఉండేవని, ప్రస్తుతం కేజీ టూ పీజీ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం వీటి సంఖ్యను 976కు పెంచిందన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై ఏడాదికి రూ.1.2లక్షలు వెచ్చిస్తున్నామన్నారు. విదేశీ విద్య కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ ద్వారా రూ.20లక్షలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో చిన్నచిన్న గిరిజన తండాలను పంచాయతీలుగా చేశామని, పంచాయతీల అభివృద్ధికి రూ.600కోట్లు కేటాయించామన్నారు. రఘునాథపాలెం మండలంలోని 19 గిరిజన గ్రామ పంచాయతీలతోపాటు, జిల్లాలోని అన్ని గిరిజన పంచాయతీల భవనాల నిర్మాణానికి రూ.25లక్షల చొప్పున కేటాయిస్తామని మంత్రి సత్యవతి హామీ ఇచ్చారు.
* అంతకుముందు మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ వెనుకబాటుకు గురైన గిరిజనులు చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల కూడా ఇచ్చారని, త్వరలోనే ఇది ప్రారంభమవుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో కాలిపోయిన మోటార్లు, విత్తనాల కోసం పడిగాపులు పడే అవస్థలు ఇప్పుడు తొలగిపోయాయన్నారు. తెలంగాణ నేడు ద్విగుణీకృతంగా వెలుగుతోందన్నారు. దావోస్లో యువనేత కేటీఆర్ పర్యటన తొలిరోజే రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టులు పెట్టుబడులు రావడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ నామా, జడ్పీ ఛైర్మన్ కమల్రాజు, కలెక్టరు గౌతమ్, ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు ప్రసంగించారు. డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషయ్య, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, మేయర్ పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమాజోహ్రా, ఆర్జేసీ కృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు మాలోతు ప్రియాంక, సర్పంచి గుడిపూడి రామారావు, ఎంపీటీసీ సభ్యురాలు మద్దినేని రజని, ఆర్డీవో రవీంద్రనాథ్, తహసీల్దారు నరసింహారావు, ఎంపీడీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన భవన్ను ప్రారంభించిన మంత్రులు
ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్టుడే: ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపులో రూ.1.10 కోట్లతో నిర్మించిన గిరిజన భవన్ను మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్కుమార్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి గిరివికాస పథకంలో జిల్లా వ్యాప్తంగా 243 మంది గిరిజనులకు మంజూరైన బోర్వెల్స్, ట్యూబ్వెల్స్ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ వీపీ గౌతమ్, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, నగర మేయర్ పి.నీరజ, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషయ్య, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం