logo

ఆధునిక దేవాలయాలు పాఠశాలలు: సండ్ర

ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్న ఘటన సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు

Published : 02 Feb 2023 06:37 IST

శిలాఫలకాన్ని ఆవిష్కరించి బుగ్గపాడు పాఠశాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే  వెంకటవీరయ్య

సత్తుపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్న ఘటన సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మనఊరు మన బడిలో భాగంగా మండల పరిధిలోని బుగ్గపాడు ప్రాథమిక పాఠశాలను రూ.27.61లక్షలతో, పాకలగూడెం ప్రాథమిక పాఠశాలలను రూ.28.45లక్షలతో ఆధునీకరించగా బుధవారం ఎమ్మెల్యే సండ్ర ప్రారంభించారు.

* చెక్కుల పంపిణీ..: 56 మందికి షాదీముబారక్‌ చెక్కులను స్థానిక మాధురి వేడుకల మందిరంలో పంపిణీ చేశారు. తాజాగా సీఎం కేసీఆర్‌ షాదీఖానాల నిర్మాణాలకు నిధులను మంజూరు చేశారని త్వరలోనే అత్యాధునిక రీతిలో వాటిని నిర్మిస్తామని తెలిపారు. పాల్వంచకు బదిలీ అయిన ఏసీపీ ఎన్‌.వెంకటేశ్‌ను శాలువాలతో సన్మానించారు. రుద్రాక్షపల్లిలో కంటి వెలుగును పరిశీలించారు. సింగరేణి ఉత్తమ ఉద్యోగిగా పురస్కారాన్ని అందుకున్న జేవీఆర్‌ ఓసీ పిట్‌ సెక్రటరీ జేఎస్‌ఆర్‌ మూర్తిని శాలువాలతో సన్మానించారు. పుర ఛైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీపీ హైమావతి, జడ్పీటీసీ సభ్యుడు రామారావు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని