పాలు.. ఆరోగ్యానికి మేలు
ఏటా జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా క్షీర దినోత్సవం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
నేడు ‘ప్రపంచ క్షీర దినోత్సవం’
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: ఏటా జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా క్షీర దినోత్సవం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 100 శాతం పోషక విలువలు, విటమిన్ బి-12 అధికంగా కలిగిన ఇవి యుక్త వయసు పిల్లల్లో, విద్యార్థుల్లో, మానసిక, శారీరక ఉత్సాహాన్ని, పెరుగుదలను, ఎముకల పటుత్వాన్ని పెంచుతాయి. రానురాను వాతావరణ సమతుల్య లోపం, వర్షాలు లేక, గ్రాసం కొరతతో పశుపోషణ కష్టమైంది. పాల ఉత్పత్తీ తగ్గిపోతోంది. దీన్నో వ్యాపార వస్తువుగా మలచుకుని అనేక ప్రైవేటు డెయిరీలు పుట్టుకొస్తున్నాయి. వీటిలో నిల్వ కోసం అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. దీంతో పోషకాల సంఖ్య సైతం తగ్గిపోతోంది.
పుట్టుగొడుగుల్లా...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రైవేటు డెయిరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రకరకాల ఆఫర్ల ఎర చూపించి రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాయి. దీనికి తోడు పొరుగు రాష్ట్రాలకు చెందిన అనేక డెయిరీలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ సహకార సమాఖ్యకు చెందిన విజయ డెయిరీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నాణ్యమైన పాలకు మారుపేరుగా నిలిచిన ఈ సంస్థ మనుగడ ఇప్పుడు కష్టమవుతోంది.
పాల ఉత్పత్తులు పెంచేందుకు కృషి...
- డాక్టర్ ఎ.కుమారస్వామి, ఉప సంచాలకుడు, విజయ డెయిరీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా
పాడి రైతులకు నూతన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించటం ద్వారా పాల దిగుబడిని 25 నుంచి 30 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. విజయ డెయిరీ, ఎస్బీఐ, పాడి రైతులతో కలిపి ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా రైతులు పాడి పశువులను కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను అందిస్తాయి. ఒకటి నుంచి మూడు పాడి పశువుల కొనుగోలు నిమిత్తం రుణాలు అందిస్తారు. రైతుల పాల బిల్లులో ఈ రుణాలను మినహాయించుకుంటారు. కొత్తగా 15 పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరికలు
[ 26-04-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం