logo

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

చంద్రుగొండలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు పలువురిపై దాడిచేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..

Published : 28 Mar 2024 01:33 IST

చంద్రుగొండ, న్యూస్‌టుడే: చంద్రుగొండలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు పలువురిపై దాడిచేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జూలూరుపాడుకు చెందిన గోలి రాజా, ఇస్లాం చింటూ, అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామానికి చెందిన కుక్కముడి అనిల్‌, నరేంద్ర, ఏన్కూర్‌ మండలం రేపల్లేవాడకు చెందిన మోదుగు శివ కలిసి పెనగడపలో ఓ వేడుకకు వెళ్లారు. అనంతరం చంద్రుగొండ వచ్చి మద్యం తాగారు. సమీపంలోని దుకాణదారుడి వద్దకు వచ్చి పానీపూరీ తిని డబ్బులు అడిగిన అతడిపై దాడి చేశారు. ఇదేమని ప్రశ్నించిన ఓ మహిళపైనా దాడికి తెగబడ్డారు. వాహనాలకు అడ్డుగావచ్చి హల్‌చల్‌ చేయడంతోపాటు ప్రశ్నించిన గ్రామస్థులతో గొడవపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఇద్దరు పోలీసులు వెళ్లగా వారితోనూ గొడవపడ్డారు. గ్రామస్థులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులతో కలిసి అయిదుగురినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్‌, జూలురుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి చంద్రుగొండ ఠాణాకు వచ్చి దాడికి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నిందితులపై ఎస్సై రవి కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని