కరవు తీరా పని..!
కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు
ఈటీవీ- ఖమ్మం, న్యూస్టుడే, సుజాతనగర్: కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది. గతం కన్నా ఈసారి రోజువారీగా నమోదవుతున్న కూలీల సంఖ్య పెరగటమే ఇందుకు నిదర్శనం. ఇటీవల కూలీలకు దినసరి కూలి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించటంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లక్షలాది మందికి లబ్ధి కలుగుతుంది. ఏప్రిల్ నుంచి ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది.
పెరుగుతున్న సంఖ్య
గతంలో మార్చి మూడోవారంలో ఒక్కో గ్రామం నుంచి సగటున 50 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరైతే.. ఈసారి ఆసంఖ్య పెరిగింది. రోజువారీగా గ్రామంలో సగటున ఖమ్మం జిల్లాలో 98 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 67 మంది కూలీలు పనులు చేస్తున్నారు. మొత్తమ్మీద ఖమ్మం జిల్లాలో 57,951 మంది, భద్రాద్రి జిల్లాలో 28,148 మంది పనులకు వెళ్తున్నారు. ఏప్రిల్ నుంచి కూలీల సంఖ్య మరింత పెరగనుంది.
ఏప్రిల్ 1 నుంచి కొత్త కూలి
ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీపికబురు అందించింది. ప్రస్తుతం అందజేస్తున్న దినసరి కూలిని పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త కూలి అమల్లోకి రానుంది. ఇప్పుడు రోజువారీ కూలి రూ.272 చొప్పున చెల్లిస్తుండగా వచ్చే నెల నుంచి రూ.30 వరకు పెరిగే అవకాశముంది. వేసవిలో మూడు నెలల పాటు ఉపాధి హామీ పనులతో కూలీలకు ఆర్థికంగా చేయూతనందనుంది.
గ్రామీణ కూలీలకు ఊతం
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితులు ఈసారి దాపురించాయి. నీరు లేక ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. పైర్లు వడబడిపోతున్నాయి. రైతు కుటుంబాలతో పాటు రోజువారీ కూలీలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంటలు పుష్కలంగా పండితే.. సీజన్ చివర్లో కూలీలకు చేతి నిండా పని దొరికేది. పంటకాలం ముగిశాక వేసవిలో ‘ఉపాధి హామీ’ బాట పట్టేవారు. ఈసారి యాసంగి సీజన్ పంటల సాగుకు ఏమాత్రం అనుకూలంగా లేకుండా పోయింది. పనులు దొరక్క ఆర్థికంగా చితికిపోతున్న గ్రామీణ నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ఊతమిచ్చేలా కనిపిస్తోంది.
పని ప్రదేశంలో వసతులు కల్పించాలని వేడుకోలు
గతంలో కూలీలకు మార్చి నుంచి జూన్ వరకు 15-30% వేసవి భత్యం చెల్లించేవారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత కారణంగా 30 శాతం భత్యం దక్కేది. రెండేళ్లుగా కూలీలకు వేసవి భత్యం అందటం లేదు. ఫలితంగా ఏటా ఏప్రిల్లో దినసరి కూలి కొంత పెంచుతున్నారు. 2022లో రూ.12, 2023లో రూ.15 పెంచారు. ఈ ఏడాది ఎంత పెంచుతారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎండల తీవ్రత నేపథ్యంలో పనిచేసే ప్రదేశంలో టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కూలీలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి