logo

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన: మంత్రి పొంగులేటి

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పాలన సాగిస్తుందని  రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Published : 06 May 2024 01:53 IST

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పాలన సాగిస్తుందని  రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా వీవీసీ తోటలో ఆదివారం రాత్రి జరిగిన ఆత్మీయ  సమావేశానికి హాజరై మాట్లాడారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తాను ప్రజల కష్టాలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నందమూరి తారకరామారావు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎప్పటికీ చిరస్మరణీయులేనని అభిప్రాయపడ్డారు. టీపీసీసీ నేత జెట్టి కుసుమకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు మహ్మద్‌ జావేద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీలు పోట్ల    నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఎం నేతలు పోతినేని సుదర్శన్‌, నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్‌, సీపీఐ నేత బాగం హేమంతరావు, నాగండ్ల దీపక్‌చౌదరి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని