ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన: మంత్రి పొంగులేటి
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన సాగిస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఖమ్మం కమాన్బజార్, న్యూస్టుడే: ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన సాగిస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా వీవీసీ తోటలో ఆదివారం రాత్రి జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరై మాట్లాడారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తాను ప్రజల కష్టాలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎప్పటికీ చిరస్మరణీయులేనని అభిప్రాయపడ్డారు. టీపీసీసీ నేత జెట్టి కుసుమకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహ్మద్ జావేద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఎం నేతలు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, సీపీఐ నేత బాగం హేమంతరావు, నాగండ్ల దీపక్చౌదరి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకటన.. నియంత్రణ నటన
[ 18-05-2024]
వర్షాకాలం ఈదురుగాలుల సమయంలో హోర్డింగులు, ఫ్లెక్సీల నిర్మాణాలు ఎక్కడ కూలి మీద పడతాయోనన్న భయం పట్టణ, నగరప్రాంత ప్రజలను వెంటాడుతోంది. ఇటీవల ముంబయిలో అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ కూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. -
బీమాతోనే రైతుకు ధీమా
[ 18-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. నష్ట వివరాలపై వ్యవసాయ అధికారులు నివేదిస్తున్నా పరిహారం అందని బాధితులెందరో. -
ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యకు.. సంగరేణి సహకారం
[ 18-05-2024]
ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులకు సింగరేణి ఊతమిస్తోంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రోత్సాహాన్ని అందించాలని యాజమాన్యం 2017లో నిర్ణయం తీసుకొంది. 2017-18 నుంచి 2022-23 విద్యాసంవత్సరం 40 మందికి రూ.76,06,760 సాయాన్ని విడుదల చేశారు. -
తాలిపేరుకు సాంకేతిక సొబగులు
[ 18-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు ప్రత్యేక సాంకేతికను అందిపుచ్చుకోనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) కింద స్కడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజేషన్) సిస్టంతో అనుసంధానించనున్నారు. -
ఉచిత వసతి.. కార్పొరేట్ విద్య
[ 18-05-2024]
ఉచిత వసతి.. కార్పొరేట్ బోధన.. వ్యవసాయ నేపథ్యం, వెనకబడిన తరగతుల వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం.. వెరసి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకానికి ఏటా ఆదరణ లభిస్తోంది. ఒకటో తరగతి నుంచే ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. -
పచ్చడి మామిడి మరింత ప్రియం
[ 18-05-2024]
ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది. -
మౌలిక వసతుల కల్పనలో పురోగతి: కలెక్టర్
[ 18-05-2024]
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పురోగతిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మ ఆదర్శ కమిటీల అభివృద్ధి పనులపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ను శుక్రవారం నిర్వహించారు. -
ఒక్క అవకాశమిస్తే ప్రజల పక్షాన నిలబడతా: గుజ్జుల
[ 18-05-2024]
ప్రాధాన్య క్రమంలో మొదటి ఓటు వేసి తనను గెలిపించాలని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27 జరిగే ఉప ఎన్నిక పోలింగ్లో భాజపాకు ఓటేయాలని కోరారు. -
అవినీతి ఘటనపై సీఎండీ ఆగ్రహం
[ 18-05-2024]
రైతు పంటపొలానికి విద్యుత్తు లైను, నియంత్రిక ఏర్పాటుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఏఈ పట్టుబడిన నేపథ్యంలో టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలి
[ 18-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్డీఓలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరుకు బీఎల్వోల ద్వారా ఓటరు చిట్టీలు అందించాలన్నారు. -
అధికారి తీరుపై గుర్రు!
[ 18-05-2024]
ప్రజాసంబంధాలు, పౌర సేవలను పల్లెల వరకు విస్తరించాల్సిన శాఖకు ఆయన జిల్లా స్థాయి అధికారి. తన పరిధిలో వందల సంఖ్యలో ఉద్యోగులుంటారు. గ్రామస్థాయి కార్యాలయాల ద్వారా నిరంతర సేవలు కొనసాగుతుంటాయి. -
రాములోరి వెండి లెక్కలపై గందరగోళం వీడేనా?
[ 18-05-2024]
భద్రాచలం రామాలయంలో స్వామివారికి ఉన్న ఆభరణలలో వెండి లెక్కపై గందరగోళం వీడడం లేదు. సుమారు 68కిలోల బంగారం, 980 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
ఎప్సెట్ ఫలితాలు నేడే
-
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!