గృహమే కదా పోలింగ్ కేంద్రం!
పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలకు రాలేనివారు సైతం ఓటుహక్కు వినియోగించుకునేలా ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం: పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలకు రాలేనివారు సైతం ఓటుహక్కు వినియోగించుకునేలా ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. 85 ఏళ్ల పైబడిన ఓటర్లు, 40 శాతం మించి వైకల్యం కలిగిన దివ్యాంగులకూ ఈ సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లోక్సభ ఎన్నికల్లో హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించిన అధికారులు ఈనెల 4 నుంచి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే 80 శాతం మంది అర్హులు ఓటుహక్కు వినియోగించుకున్నారని, బుధవారం లోగా ఈ ప్రక్రియ 100 శాతం పూర్తవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
అర్హతలు ఉన్నప్పటికీ..
ఇంటి వద్ద ఓటుహక్కు వినియోగానికి అర్హతలు ఉన్నప్పటికీ చాలామంది దరఖాస్తు చేసుకోవటం లేదు. అధిక శాతం మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేసేందుకు ఇష్టపడటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో హోం ఓటింగ్కు ఖమ్మం జిల్లాలో అర్హులు 32,663 మంది ఉంటే వీరిలో కేవలం 2,534 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో సుమారు 15వేల మంది అర్హులుంటే కేవలం 865 మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు ఏ మేరకు వస్తారో వేచిచూడాల్సిందే.
వయోవృద్ధులు, దివ్యాంగుల ఆనందం
వయో వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ సోకినవారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వాళ్ల ఇళ్లను ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలుగా మార్చేస్తున్నారు. రహస్య ఓటింగ్ ప్రక్రియకు విఘాతం కలగకుండానే నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు శరీరం సహకరించక చాలామంది ఓటింగ్కు దూరమవుతున్నారని గ్రహించిన ఎన్నికల సంఘం.. హోం ఓటింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల చాలామంది సులభంగా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇంటి నుంచే ఓటేస్తున్నవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉభయ జిల్లాల్లో..
భద్రాద్రి జిల్లాలో 865, ఖమ్మం జిల్లాలో 2,534 మంది ఓటర్లు ఇంటి నుంచే తమ ఓటుహక్కు వినియోగించుకోవటానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 4 నుంచి వీరు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతం మంది ఓటేసినట్లు సమాచారం. ఎన్నికల అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇందులో గెజిటెడ్, రెవెన్యూ అధికారులు, వీడియోగ్రాఫర్, సంబంధిత బీఎల్ఓలు పాలుపంచుకుంటున్నారు. అవకతవకలకు తావులేకుండా ఓటరు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేమేం పాపం చేశాం నాన్నా..!
[ 19-05-2024]
ఆస్తి కోసం ఓ కర్కశకుడు కన్నతల్లి, తన ఇద్దరు కూతుళ్లను హతమార్చిన సంఘటనతో.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య మృతితో త్రివేణిని రెండో వివాహం చేసుకోవడం.. -
బాధిత మహిళలకు భరోసా..
[ 19-05-2024]
ప్రస్తుత సమాజంలో మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. లైంగిక వేధింపులు. జరిగే అన్యాయాన్ని పరువు కోసం బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారెందరో ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 55 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్
[ 19-05-2024]
పూర్వ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. ఉప ఎన్నిక సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. -
టీఎస్ఈఏపీ సెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. -
ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!
[ 19-05-2024]
పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘2024-25’ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పిడుగుపాటుతో రైతు మృతి
[ 19-05-2024]
పిడుగుపాటుకు పొలంలో ఓ రైతు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన సంపసాల కృష్ణ(55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు: తమ్మినేని
[ 19-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 19-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. పసిడితో తయారు చేసిన తులసీ దళాలను సీతారాముడి పాదాల చెంత ఉంచి అర్చన చేశారు. -
‘మహస్వి’కి 102వ ర్యాంకు
[ 19-05-2024]
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాల్లో ఖమ్మం న్యూవిజన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంకు సాధింది. జేఈఈ మెయిన్స్లో సైతం ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 732వ ర్యాంకు సాధించటం విశేషం. -
ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఖమ్మం జిల్లాకు చెందిన విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులు ఈనెల 31 లోపు ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. -
రహదారుల పనులకు అనుమతి ఇవ్వండి: తుమ్మల
[ 19-05-2024]
ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ ఫేజ్-1, 3, ఎల్డబ్ల్యూఈ 2018-19, ఎస్సీఏ స్కీం కింద ప్రారంభించిన రహదారుల పనులకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటవీశాఖ మంత్రి, పీసీసీఎఫ్లకు విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఏర్పాట్లు
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా
-
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
-
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా